ప్రభుత్వం కూలుతుందనే పారిపోతోంది: దేవినేని ఉమ

మోపిదేవి వెంకట రమణను తొలగిస్తే బొత్స సత్యనారాయణ, ధర్మాన ప్రసాద రావు, వెంకట రెడ్డిలను తొలగించాల్సి వస్తుందని తద్వారా ప్రభుత్వం కుప్పకూలుతుందనే భయం కిరణ్ ను పట్టుకుందన్నారు. అందుకే వారికి సిఎం కొమ్ము కాస్తున్నారన్నారు. ప్రభుత్వం సమాధానం చెప్పేదాకా మేం నిలదీస్తామని అన్నారు. స్పీకర్ వెంటనే అందరినీ సమావేశపరచాలన్నారు. మద్యం అవినీతితో సంబంధం ఉన్న మంత్రులను బర్తరఫ్ చేయాలని తాము గవర్నర్ ను కలుస్తామని చెప్పారు. అధికారులను అరెస్టు చేసేందుకు రమణ సాక్ష్యం పనికి వచ్చినప్పుడు మంత్రులపై చర్యలకు ఎందుకు పనికి రాదని ఆయన ప్రశ్నించారు. నున్నా రమణతో టిడిపికి ఎలాంటి సంబంధం లేదని ఎమ్మెల్యే లింగా రెడ్డి అన్నారు. మద్యం కుంభకోణం అంశం గవర్నర్, రాష్ట్రపతిలకు ఫిర్యాదు చేస్తామని పల్లె రఘునాథ్ అన్నారు.












Click it and Unblock the Notifications