హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

నల్లగొండ జిల్ల నుంచి తెలంగాణలో జగన్ ఓదార్పు యాత్ర

By Pratap
|
Google Oneindia TeluguNews

YS Jagan
హైదరాబాద్: తెలంగాణలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ ఓదార్పు యాత్ర నల్లగొండ జిల్లా నుంచి ప్రారంభం కానుంది.తెలంగాణ జిల్లాల్లో త్వరలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్‌ రెడ్డి ఓదార్పు యాత్ర ప్రారంభిస్తారని ఆ పార్టీ యువజన విభాగం రాష్ట్ర శాఖ అధ్యక్షుడు పుత్త ప్రతాప్ రెడ్డి తెలిపారు. ఈ ఓదార్పు యాత్ర నల్లగొండ జిల్లా నుంచే ప్రారంభమవుతుందని ఆయన సోమవారం మీడియా ప్రతినిధులతో చెప్పారు.

యువ కిరణాల పేరిట ముఖ్యమంత్రి కిరణ్‌ కుమార్‌ రెడ్డి యువతను మోసం చేస్తున్నారని విమర్శించారు. వైయస్ జగన్ వర్గం శానససభ్యులు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లో ఉపఎన్నికలు వస్తే వైయస్సార్ కాంగ్రెసు పార్టీ తరపున పోటీ చేసే అభ్యర్థులే విజయం సాధిస్తారని చెప్పారు. ఇదే జరిగితే తమ పార్టీలోకి వలసలు పెరుగుతాయన్న భయం కాంగ్రెస్ నేతలను వెంటాడుతోందని ఆయన అన్నారు. అందుకే విప్‌ను ధిక్కరించిన వైయస్ జగన్ వర్గానికి చెందిన శాసనసభ్యులపై అనర్హత వేటు వేసేందుకు వెనుకంజ వేస్తోందని ఆయన అన్నారు.

English summary
YSR Congress president YS Jagan to begin his Odarpu Yatra from Nalgonda district in Telangana.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X