నల్లగొండ జిల్ల నుంచి తెలంగాణలో జగన్ ఓదార్పు యాత్ర
యువ కిరణాల పేరిట ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి యువతను మోసం చేస్తున్నారని విమర్శించారు. వైయస్ జగన్ వర్గం శానససభ్యులు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లో ఉపఎన్నికలు వస్తే వైయస్సార్ కాంగ్రెసు పార్టీ తరపున పోటీ చేసే అభ్యర్థులే విజయం సాధిస్తారని చెప్పారు. ఇదే జరిగితే తమ పార్టీలోకి వలసలు పెరుగుతాయన్న భయం కాంగ్రెస్ నేతలను వెంటాడుతోందని ఆయన అన్నారు. అందుకే విప్ను ధిక్కరించిన వైయస్ జగన్ వర్గానికి చెందిన శాసనసభ్యులపై అనర్హత వేటు వేసేందుకు వెనుకంజ వేస్తోందని ఆయన అన్నారు.
Comments
English summary
YSR Congress president YS Jagan to begin his Odarpu Yatra from Nalgonda district in Telangana.
Story first published: Monday, February 27, 2012, 13:01 [IST]