కోవూరులో తెరాస అభ్యర్థి పోటీ ఎందుకు?
అయితే, అన్నిటికన్నా ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడిరపై ధ్వజమెత్తడమే ప్రధాన ధ్యేయంగా ఆయన పెట్టుకున్నట్లు అర్థమవుతోంది. సోమవారం ఆయన మీడియా ప్రతినిధుల సమావేశం ఏర్పాటు చేసి నెల్లూరు జిల్లాలోని బాలాయిపల్లిలో చంద్రబాబుకు బినామీ ఆస్తులున్నాయంటూ ఆరోపించారు. ఆ బాలాయిపల్లి కోవూరు నియోజకవర్గంలోనే ఉంది. దీంతో చంద్రబాబుపై తీవ్రమైన ఆరోపణలు చేయడం ద్వారా కోవూరు ప్రజల మనసు మార్చడానికి ఏమైనా అవకాశం ఉంటుందా అనేది చూడాలనేది ఆయన ఉద్దేశం కావచ్చు.
నెల్లూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీ కాస్తా బలంగానే ఉంటుంది. కాంగ్రెసు, వైయస్సార్ కాంగ్రెసు పార్టీల మధ్య ఓట్లు చీలితే తెలుగుదేశం పార్టీ లాభపడవచ్చు. అలా జరగకుండా చూసే ఎత్తుగడ కూడా కెసిఆర్ అభ్యర్థిని దించాలనే విషయం ఇమిడి ఉన్నట్లు చెబుతున్నారు. దానికితోడు, తనపై సమైక్య నినాదం వినిపిస్తున్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఏదైనా చర్యకు దిగితే దాన్ని చంద్రబాబుకు వ్యతిరేకంగా వాడడానికి వీలవుతుందని కూడా భావిస్తున్నట్లు చెబుతున్నారు.