గుంటూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జగన్ రాలేదని అభిమాని ఆత్మహత్య, మరొకరికి విషమం

By Srinivas
|
Google Oneindia TeluguNews

Guntur District
గుంటూరు: జిల్లాలో అభిమానం ఒకరి ప్రాణాలు తీసింది. మరొకరి ప్రాణాల మీదకు తెచ్చింది. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి తమ గ్రామం రావడం లేదని తెలిసిన ఇద్దరు యువకులు ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన గుంటూరు జిల్లాలోని మండ్రువారిపాలెంలో సోమవారం చోటు చేసుకుంది. దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి మీద అభిమానంతో నబీ షాహిబ్, తన్వీర్ అనే వారు తమ గ్రామంలో ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఈ విగ్రహావిష్కరణ జగన్‌తో చేయించాలనుకున్నారు.

నాలుగు రోజులుగా జగన్ వినుకొండ ప్రాంతంలో ఓదార్పు యాత్ర నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఆయన ఈ రోజు సావల్యాపురం చేరుకున్నారు. అక్కడి నుండి మండ్రువారిపాలెం పది కిలోమీటర్లు ఉండటంతో జగన్ రాలేదని తెలుస్తోంది. జగన్ రాడని తెలిసిన వారిద్దరూ పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశారు. నబీషాహిబ్ అనే వ్యక్తి మృతి చెందగా, తన్వీర్ పరిస్థితి విషమంగా ఉంది. తన్వీర్‌ను చికిత్స నిమిత్తం వినుకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

English summary
Late YS Rajasekhar Reddy fan committed to suicide today in Guntur district.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X