సీమాంధ్రకు బాబు పెదబాబు జగన్ చినబాబు: శంకరరావు

సీమాంధ్రలో దళితులు, క్రైస్తవులు జగన్ వెంటే ఉన్నారని ఆయన చెప్పారు. జగన్కు అదే ప్రధాన ఓటు బ్యాంక్ అని చెప్పారు. తెలంగాణ ప్రాంతంలో మాత్రం అన్ని పార్టీలు రంగంలో ఉంటాయని చెప్పారు. తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావుపై ఇక్కడి ప్రజలకు పీకల వరకు కోపం ఉందని శంకర రావు అన్నారు. కాగా శాసనసభ లాబీల్లో శంకర రావు, చంద్రబాబు పరస్పరం తారాసపడినప్పుడు వారిద్దరు ఒకరినొకరు అభినందించుకున్నారు. ఈ సందర్భంగా శంకర రావు మాట్లాడుతూ.. తాను బాబును ఎందుకు అభినందించానో తనకు తెలుసునని, బాబు నన్ను ఎందుకు అభినందించారో ఆయనకు తెలుసునని అన్నారు.












Click it and Unblock the Notifications