ఉపాధి హామీపై టిడిపి సభ్యుల రగడ: అసెంబ్లీ వాయిదా
అంతకు ముందు తెలుగుదేశం సభ్యుడు పయ్యావుల కేశవ్ మాట్లాడుతూ - ఉపాధి హామి పథకం అమలు కోసం గ్రామ సభలు జరగడం లేదని, గ్రామసభలు జరిగినట్లు రుజువు చేస్తా తాను రాజీనామా చేస్తానని అన్నారు. ఉపాధి హామీ పథకం అమలుపై సభా సంఘం వేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఉపాధి హామీ పథకం అమలులో పారదర్శకతను పాటిస్తున్నామని మంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్ చెప్పారు. సామాజిక తనిఖీ సమాచారాన్ని వెబ్సైట్లో పెట్టినట్లు ఆయన తెలిపారు.
మంత్రి సమాధానంతో సంతృప్తి చెందని తెలుగుదేశం సభ్యులు స్పీకర్ పోడియాన్ని చుట్టుముట్టారు. స్పీకర్ ఎంతగా నచ్చజెప్పినప్పటికీ వారు వినలేదు. తెలుగుదేశం సభ్యులు తమ పట్టును వీడకపోవడంతో స్పీకర్ సభను 15 నిమిషాల పాటు వాయిదా వేశారు.
Comments
payyavula keshav assembly dokka manikya varaprasad hyderabad పయ్యావుల కేశవ్ శాసనసభ డొక్కా మాణిక్య వరప్రసాద్ హైదరాబాద్
English summary
Assembly adjourned for 15 minutes, as TDP members stalled the procedings on employment gaurantee scheme.
Story first published: Friday, March 2, 2012, 11:01 [IST]