వైయస్ జగన్, చంద్రబాబులపై దుమ్మెత్తిపోసిన బొత్స
తెలంగాణ సెంటిమెంటు లేదని తమ పార్టీ అనలేదని, కొన్ని పార్టీలు యూ - టర్న్ తీసుకోవడం వల్లనే తెలంగాణపై సందిగ్గత ఏర్పడిందని, త్వరలో తెలంగాణకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని ఆయన అన్నారు. ఉపాధి హామీ పథకం అమలు తీరు వల్లనే తాము రెండోసారి అధికారంలోకి వచ్చామని, టిడిపి ప్రభుత్వ హయాంలో ఆ పథకం దుర్వినియోగమైందని ఆయన అన్నారు. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో సంక్షేమ కార్యక్రమాలు చేపట్టలేదని చంద్రబాబే స్వయంగా అంగీకరించారని ఆయన అన్నారు. చంద్రబాబుకు పేద ప్రజలంటే పట్టదని ఆయన అన్నారు.
తాము అధికార ప్రతినిధులను నియమిస్తామని, వారు మాట్లాడేదే పార్టీ విధానమని ఆయన అన్నారు. ప్రతిపక్షాల విమర్శలను వారు తిప్పికొడతారని ఆయన అన్నారు. ఉప ఎన్నికల కోసం గాంధీభవన్లో కంట్రోల్ రూం ఏర్పాటు చేయనున్నట్లు ఆయన తెలిపారు. ఉప ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి మూడు లేదా నాలుగో స్థానమే దక్కుతుందని ఆయన అన్నారు. తన 27 ఏళ్ల రాజకీయానుభవంతో తాను ఈ విషయం చెబుతున్నానని ఆయన అన్నారు. చిరంజీవి ఉప ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని రేపు శనివారం ఖరారు చేస్తామని ఆయన చెప్పారు. గంటకో మాట పూటకో మాట కాంగ్రెసు విధానం కాదని ఆయన అన్నారు.
వైయస్ జగన్ వర్గం శానససభ్యులపై త్వరలో అనర్హత వేటు పడుతుందని ప్రభుత్వ చీఫ్ విప్ గండ్ర వెంకటరమణా రెడ్డి చెప్పారు. రానున్న ఎన్నికలను ఎదుర్కోవడానికి సిద్ధఫడుతున్నట్లు ఆయన తెలిపారు. శానససభలో తమ సభ్యుల తీరు, హాజరు సంతృప్తికరంగా ఉందని ఆయన అన్నారు.