ఒక్క శాతం వ్యాట్ తగ్గిస్తే 1200 కోట్లు నష్టం: సిఎం
కొత్త సంక్షేమ పథకాలను సూచించాలని ఆయన శాసనసభ్యులకు సూచించారు. శాసనసభకు శాసనసభ్యులు విధిగా హాజరు కావాలని ఆయన సూచించారు. పార్టీ బలోపేతానికి శాసనసభ్యులు కృషి చేయాలని ఆయన సూచించారు. పార్టీ కార్యకర్తలు బాగుంటేనే పార్టీ బాగుంటుందని ఆయన అన్నారు. ప్రతిపక్షాల విమర్శలను సమర్థంగా తిప్పికొట్టాలని పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ పిలుపునిచ్చారు. ప్రతిపక్షాల విమర్శలను తిప్పికొట్టేందుకు త్వరలో పార్టీకి, సిఎల్పీకి అధికార ప్రతినిధులను నియమించనున్నట్లు ఆయన తెలిపారు. ముగ్గురు మంత్రులతో ఓ కమిటీని వేయనున్నట్లు ఆయన చెప్పారు.
పార్టీలో క్రమశిక్షణా రాహిత్యాన్ని సహించబోమని ఆయన హెచ్చరించారు. శాసనసభ్యులు బాధ్యతతో వ్యవహరించాలని ఆయన సూచించారు. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకుని వెళ్లడానికి పార్టీ తరఫున, సిఎల్పీ తరఫున 20యేసి మందితో కమిటీలను వేయనున్నట్లు ఆయన తెలిపారు.