అక్రమాలపై చర్చకు సై: కెసిఆర్కు మేనల్లుడు సవాల్

గల్లీ పార్టీలతో తెలంగాణ రాదని ఢిల్లీ పార్టీలతోనే తెలంగాణ సాధ్యమన్నారు. కెసిఆర్ అక్రమాలపై మరిన్ని విషయాలను ఆధారాలతో సహా బయట పెడతానని హెచ్చరించారు. తెలంగాణ భవనంలో నిర్వహిస్తున్న న్యూస్ ఛానల్ను వెంటనే అక్కడి నుండి తొలగించాలని ఆయన డిమాండ్ చేశారు. ఇప్పటికే ఈ విషయంపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పంకజ్ ద్వివేదికి ఫిర్యాదు చేశానని చెప్పారు. ప్రభుత్వం సత్వరమే చర్యలు తీసుకోకపోతే తాను హైకోర్టును ఆశ్రయిస్తానని అన్నారు. అన్నీ తెలిసిన కెసిఆర్ చట్టాలను ఉల్లంఘించి పార్టీ కార్యాలయంలో టివి ఛానల్ నిర్వహించడమేమిటన్నారు. టిఆర్ఎస్ భవనంలో ట్రస్టు సభ్యులు ఎవరెవరో ధైర్యముంటే బయట పెట్టాలని ఆయన కెసిఆర్ ను డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications