విలీనం దిశలో చిరు పార్టీ: రాజీనామా పూర్తి, ఇక పదవే?

ఇప్పటికే విలీనంపై ప్రజారాజ్యం శాసనసభ పక్షం నుంచి స్పీకర్ కు లేఖ అందింది. ఇటీవలె సిఎల్పీ కూడా దీన్ని ఏకగ్రీవంగా ఆమోదించింది. అయితే తీర్మానం ప్రతిని స్పీకర్ కు పంపలేదు. విలీనానికి అడ్డుగా ఉన్న రెండు ప్రక్రియల్లో శోభా నాగి రెడ్డి రాజీనామా ప్రక్రియ పూర్తి కావడం, చిరుకు రాజ్యసభ మరికొద్ది రోజుల్లో ఇవ్వనున్న నేపథ్యంలో త్వరలోనే తీర్మానాన్ని పంపుతారని, ఆ తర్వాత ఒక సమావేశం నిర్వహించి విలీనాన్ని ఆమోదిస్తారని ప్రజారాజ్యం పార్టీ వర్గాలు భావిస్తున్నాయని సమాచారం. శాసనమండలిలోనూ ఇదే విధంగా విలీన ప్రక్రియ చేపడతారు. అయితే చిరంజీవి శాసనసభలో వెనుక సీట్లో కూర్చునేందుకు ఇష్ట పడటం లేదనే ప్రచారంలో వాస్తవం లేదని, ఆయనకు రాజ్యసభ వచ్చే వరకు సభలో విలీన ప్రక్రియ ఉండదన్న ఆరోపణలను పిఆర్పీ వర్గాలు అప్పుడే కొట్టి పారేశాయి.












Click it and Unblock the Notifications