తెరాసకు లగడపాటి కౌంటర్: బెజవాడలో ఐటి కంపెనీలు

Lagadapati Rajagopal
విజయవాడ: తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) నాయకులు, తెలంగాణవాదుల వాదనకు కాంగ్రెసు విజయవాడ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ కౌంటర్ వేస్తున్నట్లే కనిపిస్తున్నారు. లగడపాటి రాజగోపాల్ వంటి సీమాంధ్ర నాయకులు హైదరాబాదులో పెట్టుబడులు పెడుతున్నారని, దానివల్ల సీమాంధ్ర ప్రజలకు ఏ మాత్రం ఉపయోగం లేకుండా పోతుందనే వాదను వినిపిస్తోంది. సీమాంధ్రలోని ప్రజలను ఆ రకంగా వారి నాయకులకు వ్యతిరేకంగా సిద్ధం చేసేందుకు తెలంగాణవాదులు ఆ వాదన చేస్తున్నారు. అంతేకాకుండా విజయవాడ అభివృద్ధికి లగడపాటి రాజగోపాల్ చేసిందేమీ లేదని తెలుగుదేశం పార్టీ నాయకుడు వల్లభనేని వంశీకృష్ణ విమర్శలు సంధిస్తున్నారు. ఈ స్థితిలో విజయవాడ అభివృద్ధిపై దృష్టి కేంద్రీకరించడమే కాకుండా తన ప్రత్యర్థుల విమర్శలకు సమాధానం ఇవ్వడానికి లగడపాటి సిద్ధపడినట్లు కనిపిస్తున్నారు.

విజయవాడలో ఐటి పరిశ్రమల స్థాపనకు దేశ, విదేశీ కంపెనీలను ఆహ్వానించేందుకు ఆయన ఓ ప్రణాళిక సిద్ధం చేసినట్లు వార్తలు వచ్చాయి. దీనిపై ఆయన ఐటి రంగ నిపుణుడు జెఎ చౌదరి, మహాలక్ష్మి గ్రూప్ సంస్థల చైర్మన్ హరిశ్చంద్రప్రసాద్‌లతో ఆయన చర్చించారు. దీనిపై లగడపాటి రాజగోపాల్ ఓ తెలుగు దినపత్రిక వివరించారు. గన్నవరం సమీపంలో 30 ఎకరాల స్థలంలో మేధ పేరిట ఐటి పార్కు ఉందని, అయితే అందులో 15 శాతం భూమి మాత్రమే వినియోగంలో ఉందని, మిగతా స్థలంలో ఐటి సంస్థల స్థాపనకు రోడ్ మ్యూప్‌ను రూపొందించామని ఆయన చెప్పారు. కృష్ణా, గంటూరు, ఉభయ గోదావరి జిల్లాలకు చెందిన పలువురు హైదరాబాదు, బెంగళూరు, చెన్నైల్లోనే కాకుండా విదేశాల్లో కూడా ఐటి కంపెనీలు నడుపుతున్నారని, వారితో చర్చలు జరిపి విజయవాడకు ఐటి కంపెనీలు వచ్చేలా చేస్తానని ఆయన చెప్పారు. ఈ ఏడాదిలో బెజవాడలో పారిశ్రామికవేత్తల సదస్సు కూడా నిర్వహిస్తామని ఆయన చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+