హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

యుపి ఫలితాలు: చంద్రబాబుకు సైకిల్ జోష్

By Pratap
|
Google Oneindia TeluguNews

Chandrababu Naidu
హైదరాబాద్: ఉత్తరప్రదేశ్‌లో సమాజ్‌వాదీ పార్టీ విజయం తెలుగదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడికి జోష్ ఇస్తున్నట్లుంది. సమాజ్‌వాదీ పార్టీ ఎన్నికల గుర్తు సైకిల్ కావడమే అందుకు కారణం. ఉత్తరప్రదేశ్‌లో సైకిల్ హవా కొనసాగుతుందని, అదే విధంగా వచ్చే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌లో సైకిల్‌దే హవా ఉంటుందని ఆయన అన్నారు. ఎవరెన్ని కుప్పిగంతులు వేసినా టీడీపీ అధికారంలోకి రావడం ఖాయం అని చంద్రబాబు మంగళువారం మీడియా ప్రతినిధుల సమావేశంలో స్పష్టం చేశారు. ఎవరెన్ని కుప్పిగంతులు వేసినా విజయం తమదేనని ఆయన అన్నారు. తమ జోరును ఎవరూ అడ్డుకోలేరని ఆనయ అన్నారు. యూపీని విభజిస్తామన్నవారు, విగ్రహన్ని పెట్టాలన్న వారు ఇద్దరూ ఓడిపోయారని టీడీపీ నేత పయ్యావుల కేశవ్ అన్నారు.

ఉత్తరప్రదేశ్‌లో రాహుల్ గాంధీ కష్టం ఫలించిందని పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ అన్నారు. ఉత్తరప్రదేశ్‌లో 2014 ఎన్నికల నాటికి తమ పార్టీ పరిస్థితి మెరుగు పడుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. చంద్రబాబు వ్యాఖ్యుల హాస్యాస్పదమని, చంద్రబాబు ముందు రాష్ట్రంలోని ఉప ఎన్నికల్లో పరిస్థితి ఏమిటో చూసుకోవాలని ఆయన అన్నారు. యుపి ఫలితాలు కాంగ్రెసుకు నిరాశాజనకంగా ఏమీ లేవని ఆయన అన్నారు.

English summary
Telugudesam president N Chandrababu Naidu said that in AP also cycle will win like in UP.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X