తిరుపతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

చిరును చూపి కాపులను బలి చేస్తున్నారు: ఆదికేశవులు

By Pratap
|
Google Oneindia TeluguNews

Adikesavulu Naidu
తిరుపతి: చిరంజీవిని చూపి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కాపులను బలి చేస్తున్నారని కాంగ్రెసు నాయకుడు ఆదికేశవులు నాయుడు ఆరోపించారు. ఈ ముఖ్యమంత్రి చేస్తున్నదేమిటని ఆయన అడిగారు. గతంలో కన్నా కిరణ్ కుమార్ రెడ్డి పాలనలో అవినీతి పెరిగిపోయిందని ఆయన ఆరోపించారు. ఆదికేశవులు నాయుడు కాంగ్రెసు పార్టీకి స్వస్తి చెప్పి తెలుగుదేశం పార్టీలో చేరే అవకాశాలున్నట్లు చెబుతున్నారు. ఆదివారంనాడు ఆయన చంద్రబాబును కలిశారు. చంద్రబాబు తన వ్యక్తిగత కార్యదర్శి మనోహర్ ద్వారా కబురు పంపి, ఆదికేశవులు, ఒకప్పటి పీఆర్పీ నాయకుడు జంగాలపల్లె శ్రీనివాస్‌లను హెలిప్యాడ్ వద్దకు పిలిపించుకుని మరీ మాట్లాడినట్లు తెలిసింది. ఈ విషయంపై ఆయన ఓ ప్రముఖ దినపత్రికతో మాట్లాడారు.

చిరంజీవిని ముందుపెట్టుకుని మొత్తం కాపు సామాజిక వర్గాన్ని అణగదొక్కే ప్రయత్నం కాంగ్రెస్ చేస్తోందని ఆదికేశవులు నాయుడు ధ్వజమెత్తారు. " చిరంజీవిని రాజ్యసభకు పంపితే సరిపోతుందా అని ఆయన అడిగారు. చిరంజీవిని ముందు పెట్టుకుని రాయలసీమలోని మొత్తం కాపు సామాజిక వర్గాన్ని అణగదొక్కుతున్నారని ఆయన అన్నారు. చిరంజీవికి ఏదో చేస్తున్నట్టు మా సామాజికవర్గం మొత్తాన్ని నడివీధిలో వదిలేశారని ఆయన అన్నారు. మాజీ కేంద్ర మంత్రి సాయిప్రతాప్‌ను మూలన కూర్చోబెట్టారని ఆయన ఆరోపించారు.

English summary
Congress leader Adikeshavulu Naidu lashed out at CM Kiran kumar Reddy.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X