హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

భార్యను హత్య చేసి పారిపోయిన హైదరాబాద్ టెక్కీ

By Srinivas
|
Google Oneindia TeluguNews

Charminar
హైదరాబాద్: నగరంలోని నార్సింగి పోలీసు స్టేషన్ పరిధిలో ఓ టెక్కీ తన భార్యను హత్య చేసి పారిపోయిన సంఘటన సోమవారం జరగింది. ఇరవయ్యెనిమిదేళ్ల షామిలికి ఇన్ఫోసిస్‌లో పని చేస్తున్న శోభన్ రాజుతో గత సంవత్సరం మే నెలలో వివాహం అయింది. వివాహం సమయంలో షామిలి తండ్రి కట్నం రూపంలో రూ.పది లక్షలు, పది తులాల బంగారం ఇచ్చారు. షామిలి తండ్రి సికింద్రాబాద్ ఆర్పిఎఫ్‌లో హెడ్ కానిస్టేబుల్‌గా పని చేస్తున్నాడు. అయితే నిందితుడు అదనపు కట్నం కోసం భార్యను నిత్యం వేధించే వాడని అమ్మాయి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. షామిలి బి.టెక్ గ్రాడ్యుయేట్. సోమవారం రాత్రి సన్ సిటీలోని శాంతినగర్ కాలనీలోని తన ఇంటిలో విగత జీవిగా పడి ఉంది. ఆమె తలకి తీవ్ర గాయం ఉంది. షామిలి భర్త ఆమె తలను గోడకు గట్టిగా బాది చంపేశాడని, దానిని సూసైడ్‌గా చూపే ప్రయత్నం చేశారని ఆమె తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.

నిందితుడు రాత్రి తొమ్మిది గంటల ప్రాంతంలో తన మామకు ఫోన్ చేసి షామిలి ఆత్మహత్య చేసుకున్నదని చెప్పాడు. అయితే అంతకుముందు మధ్యాహ్నం షామిలి తన తల్లికి ఫోన్ చేసి భోజనం గురించి మాట్లాడింది. అంతకుముందు రోజు ఫోన్ చేసి, తాను బాగా లేనని, తన భర్త తనని పని చేయమని వేధిస్తున్నారని తల్లికి చెప్పారు. నీవు నాకు సరితూగవని, నేను ఇప్పుడు పెళ్లి చేసుకున్నా ఎక్కువ వరకట్నం వస్తుందని, నువ్వు అదనపు కట్నం తీసుకు రావాలని తనను తన భర్త అడుగుతున్నాడని ఆదివారం సాయంత్రం తల్లిదండ్రులకు ఫోన్ చేసి చెప్పారు. నిందితుడు పరారీలో ఉన్నాడు. నార్సింగి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాఫ్తు చేస్తున్నారు.

English summary
A 28 year old woman named Shamili was found dead under suspicious circumstances under Narsingi PS limits on Monday night.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X