ఎస్పీ జోష్, పని చేయని రాహుల్ గాంధీ చరిష్మా

రాహుల్ గాంధీ చరిష్మా అనుకున్నంత పని చేయలేదని, తాము ఆశించిన మేరకు ఫలితాలు సాధించలేకపోయామని కాంగ్రెసు అధికార ప్రతినిధి అభిషేక్ మను సింఘ్వీ వంటి నాయకులే అంగీకరిస్తున్నారు. అఖిలేష్ యాదవ్ యుపి యువతను ఆకట్టున్న సూచనలు కనిపిస్తున్నాయి. నెహ్రూ కుటుంబానికి పెట్టని కోటలుగా ఉన్న అమేథీ, రాయబరేలీ పార్లమెంటు నియోజకవర్గాల్లో కూడా కాంగ్రెసుకు ఎదురు దెబ్బ తగులుతోంది. ఫలితాలు వెలువడిన ప్రారంభంలో బిజెపి కాస్తా జోరుగానే కనిపించింది. కానీ ఆ తర్వాత అది పూర్తిగా వెనకబడిపోయింది.
రాహుల్ గాంధీ మూడు నెలల పాటు ఉత్తరప్రదేశ్ శానససభ ఎన్నికలపై దృష్టి పెట్టి విస్తృతంగా పర్యటించారు. రోడ్ షోలు నిర్వహించారు. అయినా ఫలితం లేకుండా పోయింది. సోనియా గాంధీ కూతురు ప్రియాంక గాంధీ కూడా ఎన్నికల ప్రచారం నిర్వహించారు.












Click it and Unblock the Notifications