రాహుల్, చంద్రబాబులపై జగన్ పార్టీ నేత గట్టు ఫైర్

Gattu Ramachandar Rao
హైదరాబాద్: కాంగ్రెసు నేత రాహుల్ గాంధీపై, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడిపై వైయస్ జగన్ నాయకత్వంలోని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకుడు గట్టు రామచందర్ రావు తీవ్రంగా ధ్వజమెత్తారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల తర్వాత రాహుల్ గాంధీ ఇమేజ్ ఏమిటో తేలిపోయిందని ఆయన గురువారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. యుపిఎ అధినేత సోనియా గాంధీ, రాహుల్ గాంధీ అవినీతిపరులని కాంగ్రెసు సీనియర్ నేత వి. హనుమంతరావు అంగీకరించాలని ఆయన అన్నారు. ఇప్పటికైనా విహెచ్ జగన్‌పై విమర్శలను మానుకోవాలని ఆయన సూచించారు.

చంద్రబాబు తీరు పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్లుగా ఉందని ఆయన వ్యాఖ్యానించారు. ఉత్తరప్రదేశ్‌లో సైకిల్ ప్రభంజనం మాదిరిగానే ఆంధ్రప్రదేశ్‌లో కూడా సైకిల్ గెలుస్తుందని చంద్రబాబు చేసిన ప్రకటనను ఆయన ఎద్దేవా చేశారు ములాయంతో చంద్రబాబు పోల్చుకోవడం మూర్ఖత్వమని ఆయన అన్నారు.

అవినీతిపరుడు, గజదొంగ లాంటి చంద్రబాబును 2004 ఎన్నికల్లోనే ప్రజలు తిరస్కరించారని ఆయన అన్నారు. చంద్రబాబు కాలం తీరిన సరుకు అని ఆయన అన్నారు. అలిపిరి ఘటనలో తీవ్రంగా గాయపడిన చంద్రబాబును ఏలాంటి దయ చూపకుండా ప్రజలు దారుణంగా ఓడించారని ఆయన గుర్తు చేశారు. కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీల ఆటలు సాగవని, ఇరు పార్టీలు కుమ్మక్కయిన తీరును ప్రజలు గమనిస్తున్నారని ఆయన అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+