హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వైయస్ కూతురిపైనా విషమంటూ రామోజీపై సాక్షి ఫైర్

By Pratap
|
Google Oneindia TeluguNews

Ramoji Rao
హైదరాబాద్: వైయస్ రాజశేఖర రెడ్డి కూతురిపైనా విషం చిమ్మిందంటూ రామోజీ రావు ఈనాడు దినపత్రికపై వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ సాక్షి దినపత్రిక మండిపడింది. వైయస్ రాజశేఖర రెడ్డి కూతురు షర్మిళపై ఈనాడు దినపత్రిక గురువారం ప్రచురించిన ఈ వార్తాకథనాన్ని కౌంటర్ చేస్తూ సాక్షి డైలీ శుక్రవారం ఓ వార్తాకథనాన్ని ప్రచురించింది. జగతి షేర్లపై ఈనాడు దినపత్రిక కట్టుకథలు ప్రచారం చేస్తోందని మండిపడింది. వైయస్ వ్యతిరేకులను కూడగట్టుకుని ఈనాడు రోత కథనాలు ప్రచురిస్తోందని దుమ్మెత్తిపోసింది. ఆ దుష్ప్రచారంతోనే ఒకరిద్దరు జగతి షేర్లు అమ్ముకున్నారని, దాన్ని వక్రీకరించి సిబిఐ విచారణకు భయపడి అమ్ముకున్నారని నిస్సిగ్గుగా ఈనాడు దినపత్రిక రాసిందని సాక్షి విమర్శించింది. అది 2010లో జరిగిందని, అప్పటికి సిబిఐ ఊసే లేదని, ఈనాడు అబద్ధాల వంటకం వండిందని వివరించింది.

ఒక వైపు అవి డమ్మీ కంపెనీలని రాతలు రాశారని, వాటికే నష్టమంటూ కథనాలు ప్రచురించారని సాక్షి ఈనాడు కథనంపై వ్యాఖ్యానించింది. తొలుత షేర్లు కొన్న కంపెనీలను షర్మిళకు ముడిపెట్టి విషప్రచారం సాగించిందని తప్పు పట్టింది. ఉప ఎన్నికల సమయంలో జగన్‌పై రామోజీ రోత రాతలు కొత్త కాదని, కడప ఎన్నికల్లో ఇదే కుతంత్రం చేశారని, ఇప్పుడూ అదే తీరు ప్రదర్శిస్తున్నారని సాక్షి దినపత్రిక అన్నది. షర్మిళకు చెందిన కంపెనీల్ల డైరెక్టర్లుగా ఉన్న ఇద్దరు వ్యక్తులు వేరే కంపెనీల్లో కూడా డైరెక్టర్లుగా ఉన్నారని, ఆ కంపెనీలు జగతి పబ్లికేషన్స్ షేర్లను కొని ఐదు రూపాయల లాభానికి విక్రయించారని ఈనాడు కథా సారాంశమని అంటూ ఈనాడు దాన్ని ఎలా వక్రీకరించింది సాక్షి దినపత్రిక వివరించింది.

English summary
YSR Congress president YS Jagan's Sakshi daily published a report countering Ramoji Rao's Eenadu report.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X