ఎందుకు అలా రాస్తున్నారో తెలుసు: సియాసత్‌పై కెసిఆర్

K Chandrasekhar Rao
హైదరాబాద్: సియాసత్ దినపత్రిక ఏం రాస్తుందో, ఎందుకు రాస్తుందో తమకు తెలుసునని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు అన్నారు. శనివారంనాడు ఆయన జమాతే ఇస్లామిక్ హింద్ ప్రతినిధులను కలిశారు. తెలంగాణలోని ఐదు స్థానాల్లో తెరాస అభ్యర్థులను, నాగర్ కర్నూలులో నాగం జనార్దన్ రెడ్డిని తాము బలపరుస్తున్నట్లు జమాతే ఇస్లామిక్ హింద్ ఎపి, ఒరిస్సా అధ్యక్షుడు అరిఫుద్దీన్ చెప్పారు. ఈ సందర్భంగా కెసిఆర్ మీడియా ప్రతినిధులతో మాట్లాడారు.

మహబూబ్‌నగర్‌లో తెలంగాణ జెఎసి ఏ పార్టీకి కూడా మద్దతు ప్రకటించలేదని కెసిఆర్ చెప్పారు. ఈ వ్యవహారంపై ప్రశ్నలు అడిగిన మీడియా ప్రతినిధుల పట్ల ఆయన కాస్తా అసహనం ప్రదర్శించారు. తాను చెప్పేది కూడా వినాలని ఆయన సూచించారు. సియాసత్ ఏం రాస్తుందో తనకు తెలుసునని, ఏం రాసిందో చెప్పాలా అని ఆయన అన్నారు. మీకు ఇష్టం వచ్చింది రాసి, చెప్పాలని నన్ను అడిగితే ఎలా అని ఆయన ప్రశ్నించారు.

మద్దతు వార్తలను ఖండించిన తర్వాత కూడా రాశారని ఆయన అన్నారు. మీకు ఇష్టం ఉంది రాసుకోండి, నేను వద్దనడం లేదని ఆయన అన్నారు. ఆంధ్ర మీడియా ప్రభావంతో అలా రాస్తున్నారని ఆయన అన్నారు. మహబూబ్‌నగర్‌లో ఇబ్రహీం ఇప్పటికే గెలిచారని, బిజెపి పోటీ చేయడం వల్ల తమకు మేలు జరుగుతోందని ఆయన అన్నారు. ఉప ఎన్నికల్లో తమకు సహకరించాలని ముస్లింలను కోరుతున్నట్లు ఆయన తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+