వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

యుపి పీఠం అఖిలేష్ యాదవ్‌దే, ఎమ్మెల్యేల ఛాన్స్

By Pratap
|
Google Oneindia TeluguNews

Akhilesh Yadav
లక్నో: ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి పీఠం 38 ఏళ్ల అఖిలేష్ యాదవ్‌కే దక్కింది. సమాజ్‌వాదీ పార్టీ శాసనసభ్యులు శనివారం సమావేశమై అఖిలేష్ యాదవ్‌ను తమ నేతగా ఎన్నుకున్నారు. సమాజ్‌వాదీ పార్టీ అధినేత, అఖిలేష్ తండ్రి ములాయం సింగ్ యాదవ్ తన కుమారుడిని ముఖ్యమంత్రిని చేయడానికే సిద్ధపడ్డారు. అఖిలేష్ పేరును రాంపూర్ శానససభ్యుడు ఆజంఖాన్ ప్రతిపాదించారు. అఖిలేష్‌ను వ్యతిరేకిస్తున్న ఆజంఖాన్‌ను బుజ్జగించి, వ్యూహాత్మకంగా ఆయన చేతనే ములాయం సింగ్ అఖిలేష్ పేరును ప్రతిపాదింపజేశారు. దీంతో యుపి ముఖ్యమంత్రి ములాయం సింగ్ అవుతారా, అఖిలేష్ అవుతారా అనే సంశయానికి తెర పడింది.

అఖిలేష్ యాదవ్ ఎన్విరాన్‌మెంటల్ ఇంజనీరింగులో పిజి చేశారు. మూడు సార్లు పార్లమెంటు సభ్యుడిగా ఎన్నికయ్యారు. తొలిసారి కనౌజ్ నుంచి 2000లలో పార్లమెంటుకు ఎన్నికయ్యారు. 1973 జులై 1వ తేదీన ఆయన జన్మించారు. శనివారం జరిగిన ఎస్పీ శాసనసభా పక్ష సమావేశానికి ములాయం సింగ్ యాదవ్ కూడా హాజరయ్యారు. జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించి, మూడో ఫ్రంట్ ఏర్పాటు కోసం ప్రయత్నాలు సాగించడానికి ములాయం సింగ్ యాదవ్ ముఖ్యమంత్రి పీఠానికి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు చెబుతున్నారు. ఈ నెల 15వ తేదీన అఖిలేష్ యాదవ్ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయనున్నారు. యుపి ముఖ్యమంత్రి పదవిని చేజిక్కించుకున్న అతి పిన్న వయస్కుడు అఖిలేష్ యాదవే.

English summary
Akhilesh Yadav to be next CM of Uttar Pradesh. Samajwadi party MLAs elected Akhilesh Yadav as their leader.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X