ఎమ్మెల్యేలు వస్తానంటే వద్దన్నా: జగన్ ఉద్వేగ ప్రసంగం

రాజకీయ వ్యవస్థను మార్చాల్సిన అవసరం వచ్చిందని ఆయన అభిప్రాయపడ్డారు. తాను కాంగ్రెసు పార్టీని వీడిన సమయంలో అది రాజకీయ ఆత్మహత్య అవుతుందని తనకు చాలా మంది చెప్పారన్నారు. కానీ తాను ప్రజల కోసం పార్టీని వీడక తప్పలేదన్నారు. పార్టీ వీడినప్పటి నుండి తనకు ప్రజలు అండగా నిలిచారన్నారు. నల్లకాల్వలో ఇచ్చిన మాటకు కట్టుబడ్డానన్నారు. ఎవరెన్ని చెప్పినా ప్రజల కోసమే నా పోరాటం అన్నారు. ఎంతకాలం బతికామన్నది ముఖ్యం కాదని ఎంత బాగా బతికామన్నదే ముఖ్యమన్నారు. కాగా పార్టీ గౌరవాధ్యక్షురాలు వైయస్ విజయమ్మ పులివెందులలోని వైయస్సార్ స్టేడియంలో పార్టీ జెండా ఎగురవేశారు.












Click it and Unblock the Notifications