మంత్రుల వల్లే జగన్ కోట్లు సంపాదించారు: పయ్యావుల
తమ దృష్టిలో ఆరుగురు మంత్రులు కాదని పదకొండు మంత్రులు అవినీతిపరులు అన్నారు. దేశంలో అన్ని రాష్ట్రాలలో అవినీతికి పాల్పడిన మంత్రులు, నేతలు మొదట జైళ్లకెళ్తున్నారని, ఆ తర్వాత అధికారులు వెళ్తున్నారని అన్నారు. కానీ ఇక్కడ మాత్రం అందుకు రివర్స్గా ఉందని ఎద్దేవా చేశారు. నోటీసులు అందుకున్న మంత్రులు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. మంత్రుల వ్యవహారం సభలో చర్చకు వచ్చే వరకు పట్టుబడతామని అన్నారు. మంత్రుల అవినీతిని సభలో ఎండగడతామన్నారు. స్పీకర్ చర్చకు అనుమతించాలని అన్నారు. మంత్రులను వెంటనే సిఎం బర్తరఫ్ చేయాలన్నారు. సభలో రోజుకు 12 గంటలు చర్చించేందుకైనా తాము సిద్ధంగా ఉన్నామన్నారు.
payyavula keshav supreme court ys jagan assembly hyderabad పయ్యావుల కేశవ్ సుప్రీం కోర్టు వైయస్ జగన్ అసెంబ్లీ హైదరాబాద్
English summary
TDP leader Payyavula Keshav blamed that YSR Congress party chief YS Jaganmohan Reddy earned money with minister support.
Story first published: Tuesday, March 13, 2012, 10:12 [IST]