వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆటోతో గుద్దితే సైకిల్ బద్దలవుతుంది: టిడిపిపై కెసిఆర్

By Pratap
|
Google Oneindia TeluguNews

K Chandrasekhar Rao
మహబూబ్‌నగర్: ఆటోతో గుద్దితే సైకిల్ బద్దలవుతుందని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు వ్యాఖ్యానించారు. ఆటో నాగర్ కర్నూలు అభ్యర్థి నాగం జనార్దన్ రెడ్డి గుర్తు కాగా, సైకిల్ తెలుగుదేశం పార్టీ ఎన్నికల గుర్తు. కాంగ్రెసు చేయిని బంగాళాఖాతంలో విసిరేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఉప ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి బుద్ధి చెప్పాలని ఆయన ప్రజలను కోరారు. నాగం జనార్దన్ రెడ్డి తరఫున ఆయన బుధవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. తెలుగుదేశం పార్టీలో ఆంధ్రా గులాంలే పదవుల్లో ఉన్నారని ఆయన వ్యాఖ్యానించారు. టిడిపి అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు పార్టీ అభ్యర్థి మర్రి జనార్దన్ రెడ్డితో ఎన్ని కోట్లు ఖర్చు పెట్టిస్తున్నారని ఆయన అడిగారు. ఉప ఎన్నికల కోసం మర్రి జనార్దన్ రెడ్డి కోట్ల రూపాయల విలువ చేసే మద్యాన్ని బుక్ చేసి పెట్టారని ఆయన అన్నారు. సీమాంధ్ర పార్టీలు ఒక్కటై తెలంగాణ రాకుండా అడ్డుకుంటున్నాయని ఆయన విమర్శించారు.

కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీ నాయకులు టక్కుటమార విద్యలు ప్రదర్శించాలని చూస్తున్నారని ఆయన అన్నారు. తెలుగుదేశం పార్టీ గోలేంది, కాంగ్రెసు గందరగోళమేందని ఆయన అడిగారు. కల్వకుర్తి ఎత్తిపోతల పథకం ద్వారా నీరు రాకపోయినా సరే గానీ నారా వారి సారా నాగర్ కర్నూలులో ఏరులై పారుతోందని ఆయన వ్యాఖ్యానించారు. ఆరింటిలో ఒకటి, రెండు స్థానాలను సీమాంధ్రులు కైవసం చేసుకుని తెలంగాణవాదం లేదని చెప్పడానికి ప్రయత్నిస్తున్నారని ఆయన అన్నారు. తెలుగుదేశం అభ్యర్థి మర్రి జనార్దన్ రెడ్డిని ఆయన తిర్రి జనార్దన్ రెడ్డిగా ఆయన అభివర్ణించారు. తెలంగాణ కెసిఆర్ జాగీరా అని చంద్రబాబు ప్రశ్నించడాన్ని ఆయన వ్యతిరేకించారు. నాగం జనార్దన్ రెడ్డి గులాబీ కండువా మీదేసుకున్నారు.

English summary
TRS president K Chandrasekhar Rao lashed out at TDP president N Chandrababu Naidu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X