చేతులు జోడిస్తున్నా: సిఎం, టిఆర్ఎస్ అభ్యర్థిపై సెటైర్

Kiran Kumar Reddy
అదిలాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ అభ్యర్థి గంపా గోవర్ధన్ మాజీ శాసనసభ్యుడిగా ఉండేందుకే రాజీనామా చేశారని, కాబట్టి ఆయన కోరికను నెరవేర్చాలని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కామారెడ్డి ఓటర్లను కోరారు. ఆయన నిజామాబాద్ జిల్లాలోని కామారెడ్డి ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. కామారెడ్డి ప్రజలకు చేతులు జోడించి కోరుతున్నానని, కాంగ్రెసు అభ్యర్థికి ఓటు వేయాలన్నారు. యెడ్ల రాజారెడ్డికి ఓటు వేసి నియోజకవర్గం అభివృద్ధికి తోడ్పడాలన్నారు. రాష్ట్రంలో రెండు కోట్ల మందికి కిలో రూపాయికి బియ్యం ఇస్తున్నామన్నారు. అర్హులకు వడ్డీలేని లక్ష రూపాయల రుణం ఇస్తున్నామని చెప్పారు. మాజీ మంత్రి షబ్బీర్ అలీ ఓడిపోయిన తర్వాత ఈ నియోజకవర్గం వెనుకబడిందన్నారు. వచ్చే వారం రోజుల్లో ప్రాణహితపై మహారాష్ట్రతో ఒప్పందం చేసుకుంటామని చెప్పారు. తెలంగాణ గుండెచప్పుడు అధిష్టానానికి తెలుసునని ఆయన అన్నారు. అయితే ఈ అంశం సున్నితమైనదని, దీనిపై సంయమనం పాటించాలని కోరారు. తెలంగాణ ఉద్యమం 1953 నుండి ఉందని అన్నారు.

రాష్ట్రంలో అందరి అభిప్రాయాలను కేంద్రం సేకరిస్తోందన్నారు. ప్రాణహిత - చేవేళ్ల ద్వారా 80 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందని అన్నారు. తెలంగాణ సెంటిమెంటు ఉందని అయితే అభివృద్ధి కూడా ముఖ్యమన్నారు. తెలంగాణను కేంద్రం చూసుకుంటుందని, కాంగ్రెసు అభ్యర్థికి మీరు ఓటు వేస్తే నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందని ఓటర్లకు సూచించారు. కాగా కాంగ్రెసు పార్టీ కామారెడ్డిలో గెలుపొందడం ఖాయమని ఆ పార్టీ కార్యకర్తలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కాగా సిఎం ప్రచారంలో మాజీ ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు, శాసనమండలి సభ్యుడు డి శ్రీనివాస్, మాజీ మంత్రి షబ్బీర్ అలీ పాల్గొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+