రైల్వే బడ్జెట్: మమతకు ప్రశంసలు, సేఫ్టీకి ప్రాధాన్యం

ప్రస్తుతం దేశంలో ఆశించిన స్థాయిలో ప్రమాణాలు లేవని ఆయన అన్నారు. ప్రమాదాల్లో ఒక్క మరణాన్ని కూడా సహించబోమని ఆయన హామీ ఇచ్చారు. హైస్పీడ్ రైల్వే సేఫ్టీ కమిటీ సూచనలను పరిగణనలోకి తీసుకుంటామని ఆయన చెప్పారు. విదేశాల్లో హైస్పీడ్ రైళ్లు ఉన్నా ప్రమాదాలు తక్కువగా ఉన్నాయని ఆయన చెప్పారు. భద్రత విషయంలో ఐరోపా, జపాన్ వంటి దేశాలతో పోటీ పడాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. మౌలిక సదుపాయాలకు పెద్ద పీట వేస్తామని చెప్పారు. 14 లక్షల మంది ఉద్యోగులే రైల్వే బలమని ఆయన అన్నారు. ఆధునీకరణలో జాప్యం జరగడానికి నిధుల కొరత కారణమని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications