హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తెలంగాణలో కిరణ్, చంద్రబాబు: కోవూరులో జగన్

By Pratap
|
Google Oneindia TeluguNews

Chandrababu Naidu-Kiran Kumar Reddy-YS Jagan
హైదరాబాద్: ఉప ఎన్నికల ప్రచారానికి మరో రోజు మాత్రమే గడువు ఉన్న నేపథ్యంలో వివిధ పార్టీల అగ్ర నాయకులు ప్రచారాన్ని ఉధృతం చేశారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తెలంగాణలో ప్రచారం నిర్వహించగా, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ కోవూరులో ప్రచారం నిర్వహించారు. కాంగ్రెసు, తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస)లపై చంద్రబాబు నిప్పులు చెరగడమే కాకుండా ప్రజలకు హామీలు కూడా ఇచ్చారు. కాంగ్రెసు, తెరాస కుమ్మక్కయ్యాయని ఆయన విమర్శించారు. ఆయన వరంగల్ జిల్లాలోని స్టేషన్ ఘనపూర్, నాగర్ కర్నూలు నియోజకవర్గాల్లో పర్యటించారు. తెలంగాణకు వ్యతిరేకంగా తాను మాట్లాడలేదని, మాట్లాడబోనని చెబుతూ తెలంగాణ ప్రజలను నమ్మించే ప్రయత్నం చేశారు.

ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెసు అభ్యర్థి విజయం కోసం మహబూబ్‌నగర్‌లో ప్రసంగించారు. తెరాస అధ్యక్షుడు కెసిఆర్‌పై, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడిపై ఆయన తీవ్రంగా ధ్వజమెత్తారు. కెసిఆర్‌పై మునుపెన్నడూ లేని విధంగా విమర్సనాస్త్రాలు సంధించారు. కెసిఆర్ ఉప ఎన్నికలతో పబ్బం గడుపుకుంటున్నారని ఆయన విమర్శించారు. కాగా, తెరాస అధ్యక్షుడు కెసిఆర్ కామారెడ్డిలో ప్రచారం నిర్వహించారు. కామారెడ్డిలో తెలంగాణ ఉద్యమాన్ని ప్రస్తావిస్తూ ప్రజా చైతన్యాన్ని ఆయన గుర్తు చేశారు.

ఇకపోతే, వైయస్ జగన్ కోవూరులో తెరిపిలేకుండా ప్రచారం నిర్వహిస్తున్నారు. కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీలపై ఆయన దుమ్మెత్తిపోశారు. చంద్రబాబు, కిరణ్ కుమార్ రెడ్డి కుమ్మక్కయి తమ పార్టీ అభ్యర్థి నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డిని ఓడించడానికి కుమ్మక్కయ్యారని ఆయన విమర్శించారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే రాజన్న పాలన వస్తుందని ఆయన చెప్పారు.

English summary
TDP president N Chandrababu Naidu and CM Kiran Kumar Reddy campaigned in Telangana, YSR Congress president YS Jagan in Kovvur.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X