మాజీని అవుతాననే భయంతోనే...: కెసిఆర్పై సిఎం

పార్లమెంటు సభ్యుడిగా గెలిపిస్తే 13 సార్లు మహబూబ్నగర్కు కెసిఆర్ వచ్చారని, పార్లమెంటుకు మాత్రం వెళ్లరని, పాలమూరును అభివృద్ధి చేయరని ఆయన అన్నారు. కాంగ్రెసు అభ్యర్థిని గెలిపిస్తే అభివృద్ధి జరుగుతుందని ఆయన చెప్పారు. ప్రజలను రెచ్చగొట్టి పబ్బం గడుపుకోవడానికే కెసిఆర్ ప్రయత్నిస్తున్నారని ఆయన విమర్శించారు. చంద్రబాబు గురించి, ఆయన చేసిన అభివృద్ధి గురించి అందరికీ తెలిసిందేనని ముఖ్యమంత్రి అన్నారు. ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడం వల్లనే తాను రాజకీయంగా ఉన్నతస్థితికి వచ్చానని ఆయన అన్నారు.
ముఖ్యమంత్రిని అడ్డుకోవడానికి బిఇడి విద్యార్థులు ప్రయత్నించారు. దీంతో పోలీసులు జోక్యం చేసుకుని లాఠీచార్జీ చేశారు. దీంతో బిఇడి అభ్యర్థులు చెదిరిపోయారు.












Click it and Unblock the Notifications