విశాఖపట్నం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రామోజీ రావుపై ఎసిబి విచారణ, ఈనాడు స్థలం గొడవ

By Pratap
|
Google Oneindia TeluguNews

Ramoji Rao
విశాఖపట్నం : 'ఈనాడు' గ్రూపు సంస్థల యజమాని సీహెచ్ రామోజీరావుపై విశాఖ ఏసీబీ కోర్టులో కేసు దాఖలైంది. సీతమ్మధారలోని 'ఈనాడు' కార్యాలయం స్థలానికి సంబంధించి చాలాకాలంగా వివాదం నడుస్తోంది. స్థల యజమాని మంతెన ఆదిత్య ఈశ్వరకుమార్ కృష్ణవర్మ - గురువారం ఏసీబీ కోర్టులో ఈ కేసు దాఖలు చేశారు. రోడ్డు విస్తరణ సమయంలో తనకు సరైన సమాచారం తెలియజేయకపోవడాన్ని కృష్ణవర్మ తప్పుబట్టారు.

ఈ విషయంలో రామోజీరావుకు అప్పటి జిల్లా అధికారులు ఎస్‌వీ ప్రసాద్, కేవీ రావులు సహకరించారని కృష్ణవర్మ ఆరోపించారు. వీరిని కూడా ప్రతివాదులుగా పిటిషన్‌లో చేర్చారు. పిటిషన్‌ను స్వీకరించిన ఏసీబీ కోర్టు.. రామోజీరావుపై విచారణ జరపాలంటూ విశాఖ ఏసీబీ డీఎస్పీని ఆదేశించింది. ఇక, ఎస్‌వీ ప్రసాద్, కేవీ రావులపై కూడా దర్యాప్తు చేయాలని ఆదేశించిన కోర్టు వచ్చేనెల 16లోగా తమకు నివేదిక ఇవ్వాలని ఏసీబీకి సూచించింది. విశాఖపట్నంలోని సీతమ్మధారలోని ఆదిత్య వర్మ స్థలాన్ని 1974లో లీజుకు తీసుకున్న రామోజీరావు అందులో 289 చదరపు మీటర్లు రోడ్డు విస్తరణకు ఇచ్చి, ప్రతిఫలంగా 876 మీటర్లు తీసుకున్నారని, తనది కాని స్థలాన్ని రామోజీరావు ప్రతిఫలంగా పొందారని ఆరోపించారు.

English summary
ACB court has ordered ACB DSP to probe into Ramoji Rao's land issue.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X