..రాష్ట్రం తీసుకోండి: తెలంగాణ ప్రజలకు డ్రీమ్ గర్ల్ ఆఫర్
త్వరలో తెలంగాణ ప్రజల ఆకాంక్ష నెరవేరుతుందని అన్నారు. ఏ పార్టీలు అయినా ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పని చేయాలన్నారు. బిజెపితోనే తెలంగాణ సాధ్యమన్నారు. యుపిఏ తెలంగాణ బిల్లు పెడితే బిజెపి మద్దతిస్తుందని లేకపోతే 2014లో ఎన్డీయే అధికారంలోకి వచ్చాక తెలంగాణ ప్రజల చిరకాల వాంఛ నెరవేరుతుందని హామీ ఇచ్చారు. రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు కిషన్ రెడ్డి.. తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు మజ్లిస్ పార్టీతో పొత్తు పెట్టుకుంటే ప్రజలు ఎన్నటికీ క్షమించరన్నారు. మహబూబ్ నగర్లో ఆయన మతవిద్వేషాలను రెచ్చగొట్టే రీతిన ప్రసంగించడం శోచనీయమన్నారు.
కాగా మ.నగర్ ఉప ఎన్నికల ప్రచారానికి వెళ్లిన టిఆర్ఎస్ అధినేత కెసిఆర్ బిజెపిని విమర్శించడం సరికాదని ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామచంద్ర రావు హైదరాబాదులో అన్నారు. ఓట్ల కోసం దిగజారి మాట్లాడవద్దని హితవు పలికారు. కెసిఆర్ తెలంగాణవాదానికే చిచ్చు పెట్టే విధంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. జాతీయ పార్టీ వల్ల తెలంగాణ రాదంటున్న కెసిఆర్ పదకొండేళ్లుగా ప్రాంతీయ పార్టీని నిర్వహిస్తూ ప్రత్యేక రాష్ట్రాన్ని ఎందుకు తీసుకు రాలేక పోయారని ప్రశ్నించారు. ఆయనకు దమ్ముంటే తన పార్టమెంటు సభ్యత్వానికి రాజీనామా చేసి ఇతర పార్టీలతో పొత్తు పెట్టుకోకుండా ఒంటరిగా పోటీ చేసి మళ్లీ గెలవాలని సవాల్ విసిరారు. మ.నగర్ ఎంపీగా ఆ ప్రాంత సమస్యల గురించి ఒక్కసారి కూడా పార్లమెంటులో ప్రస్తావించని కెసిఆర్కు ఈ ఉప ఎన్నికల్లో ప్రజల ఓట్లు అడిగే హక్కు లేదని ధ్వజమెత్తారు.