యురేనియం కార్పోరేషన్ అధికారులపై జగన్ ఆగ్రహం

YS Jagan
కడప: కడప జిల్లా పులివెందులలో యురేనియం కార్పొరేషన్ అధికారులు వ్యవహరిస్తున్న తీరుపై వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆరు నెలల క్రితం నిర్వహించిన గ్రీవెన్స్ సెల్ కమిటీ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను అమలు చేయకుండా సమస్యలు పరిష్కరించకుండా ఏ విధంగా సమావేశం పెట్టారని ఆయన యురేనియం ప్లాంట్ అధికారులను నిలదీశారు. యురేనియం ప్లాంట్ వల్ల పులివెందుల ప్రాంతంలో భూగర్భజలాలు అడుగంటుతాయని, కాలుష్యమవుతాయనే విషయాన్ని, భూములు కోల్పోయినవారికి ఉద్యోగాలు, నష్టపరిహారం చెల్లించడం లేదనే విషయాన్ని ఆయన గత సమావేశంలో ప్రస్తావించారు. రైతులు, స్థానికుల డిమాండ్లను పరిష్కరించిన తర్వాతనే సమావేశం పెడతామని చెప్పి వాటిని పరిష్కరించకుండా సమావేశం ఎలా పెట్టారని ఆయన అడిగారు.

ఇచ్చిన హామీలను నెరవేర్చరు, నెరవేర్చాలని ఆందోళన చేస్తే పోలీసు కేసులు పెడతారని, ఇక్కడంతా ఎమర్జెన్సీ పాలన నడుస్తోందని ఆయన అధికారులపై మండిపడ్డారు. ఇన్ని సమస్యలున్నా అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం సరి కాదని ఆయన అన్నారు. సమస్యలన్నీ పరిష్కరించిన తర్వాతనే రెండో ప్లాంట్ గురించి మాట్లాడుకుందామని చెప్పి ఆయన సమావేశాన్ని బహిష్కరించారు. ఆయనతో పాటు మిగతా సభ్యులు కూడా సమావేశాన్ని బహిష్కరించారు. యురేనియం ప్లాంట్‌కు సంబంధించిన సమస్యలు పరిష్కరించే వరకు గ్రామస్తులతో కలిసి పోరాటం చేస్తానని ఆయన హామీ ఇచ్చారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+