చిరంజీవి ప్రకటన: గల్లా అరుణ కొడుకుకు లైన్ క్లియర్?

తిరుపతి స్థానంపై ఎవరిని నిలబెట్టాలనే విషయాన్ని అధిష్టానం చిరంజీవికి వదిలేస్తే ఆయన తన తమ్ముడు నాగబాబు పేరునే ప్రతిపాదించే అవకాశాలు ఉన్నాయనే వాదనలు వినిపించాయి. గల్లా అరుణ కుమారి కూడా తన తనయుడి రాజకీయ రంగ ప్రవేశం గురించి ఇప్పటికే అధిష్టానం చెవిలో వేసినట్లుగా వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో చిరంజీవి స్థానంలో అధిష్టానం ఎవరికి అవకాశం ఇస్తుందనే అంశంపై చర్చ కొనసాగింది. అయితే చిరంజీవి ప్రకటనతో గల్లా జయదేవ్నే పోటీ చేసే అవకాశం ఎక్కువగా ఉందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. జయదేవ్ మొదట శ్రీకాకుళం నుండి రంగంలోకి దిగాలని యోచించారట. అయితే అనుకోకుండా చిరంజీవి స్థానం ఖాళీ అవుతుండటంతో ఆయన తన దృష్టిని శ్రీకాకుళం నుండి తిరుపతి వైపు మరల్చారని చెబుతున్నారు. అయితే తిరుపతి స్థానాన్ని ఆశిస్తున్న వారిలో జయదేవ్తోపాటు ఇంకా కాంగ్రెసులో ఎందరు ఉన్నారో చిరంజీవి రాజీనామా చేసి ఉప ఎన్నికల నోటిఫికేషన్ విడుదల అయితే మాత్రం తెలియదు.












Click it and Unblock the Notifications