కెటిఆర్ను పట్టించుకోమన్న రమేష్, బాబు చెప్తారని గౌడ్
తనపై వచ్చిన ఆరోపణలకు తమ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడే సమాధానం చెప్పారని, తాను చెప్పాల్సిన అవసరం లేదని మరో నేత దేవేందర్ గౌడ్ చెప్పారు. జాతీయస్థాయిలో తాను బిసి సమస్యలపై తన వాణిని వినిపిస్తానన్నారు. పార్టీ మొదటి నుండి అన్ని వర్గాల వారికి అండగా ఉంటుందని అన్నారు. తాను పార్టీ ప్రతిష్టను మరింత పెంచేందుకు కృషి చేస్తానని చెప్పారు. నామినేషన్ దాఖలు చేసిన తర్వాత అసెంబ్లీ లాబీల్లో ఎదురైన సిఎం రమేష్, తిరుపతి శాసనసభ్యుడు చిరంజీవి పరస్పరం అభినందనలు తెలుపుకున్నారు. అంతకుముందు సిఎం రమేష్, దేవేందర్ గౌడ్ ఎన్టీఆర్ గార్డెన్ వద్ద స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహానికి నివాళులు అర్పించారు. ఆ తర్వాత నామినేషన్ దాఖలు చేశారు. కాగా సిఎం రమేష్ పేరును గాలి ముద్దు కృష్ణమ నాయుడు, ఎల్ రమణ ప్రతిపాదించగా, దేవేందర్ గౌడ్ పేరును పరిటాల సునీత, ఉమా మాధవ రెడ్డి ప్రతిపాదించారు.