త్వరలో కొత్తమంత్రి: పిఎం, వీగిన బిజెపి, లెఫ్ట్ తీర్మానం

Manmohan Singh - Sushma Swaraj
న్యూఢిల్లీ: లోకసభలో ఎన్‌సిటిసిని వ్యతిరేకిస్తూ భారతీయ జనతా పార్టీ, వామపక్షాలు ప్రవేశ పెట్టిన అవిశ్వాస తీర్మానం వీగిపోయింది. ప్రభుత్వం నెగ్గింది. యుపిఏ ప్రభుత్వం ఎన్‌సిటిసిని వ్యతిరేకిస్తూ బిజెపి నేత సుష్మా స్వరాజ్ లోకసభలో అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెట్టారు. అవిశ్వాస తీర్మానానికి వ్యతిరేకంగా 227 రాగా అనుకూలంగా 141 ఓట్లు వచ్చాయి. లెఫ్ట్ పార్టీలు పెట్టిన తీర్మానం కూడా వీగిపోయింది. దీంతో ఇది వీగి పోయింది. మమతా బెనర్జీ ఆధ్వర్యంలోని తృణమూల్ కాంగ్రెసు, ఉత్తర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి మాయావతి ఆధ్వర్యంలోని బహుజన్ సమాజన్ పార్టీలు ఈ తీర్మానానికి గైర్హాజరయ్యాయి. లోకసభలో అవిశ్వాస తీర్మాన వీగిపోయినట్లు స్పీకర్ ప్రకటించారు.

కాగా అంతకుముందు ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ లోకసభలో మాట్లాడారు. ఎన్‌సిటి‌సి రాష్ట్రాలపై పెత్తనం చేసేందుకు కాదని స్పష్టం చేశారు. ధరల పెరుగుదలపై ఆందోళన వ్యక్తం చేసిన ప్రధాని అన్ని సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కొంటామని చెప్పారు. సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా పని చేస్తున్నామని అన్నారు. ఉగ్రవాదాన్ని సమర్థవంతంగా ఎదుర్కొనేందుకే ఎన్‌సిటిసిని తెర పైకి తెచ్చాసమన్నారు. కాగా రైల్వే మంత్రి తనకు పంపిన రాజీనామా ఆమోదం కోసం రాష్ట్రపతికి పంపినట్లు చెప్పారు. కొత్త రైల్వే మంత్రి త్వరలో బాధ్యతలు చేపడతారని చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+