అవినీతిపై చర్చకు బిఎసిలో కుదరని ఏకాభిప్రాయం

తెలంగాణ రాష్ట్ర సమితి ఎమ్మెల్యే హరీష్ రావు కూడా అవినీతిపై చర్చ జరపాలన్నారు. అవినీతిపై చర్చ జరిపేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి చెప్పారు. జీరో అవర్ తర్వాత బిఏసీ సమావేశం నిర్వహించి, అవినీతిపై చర్చకు సమయం నిర్ణయిద్దామని స్పీకర్ నాదెండ్ల మనోహర్ ఆల్పార్టీ నేతలకు తెలిపారు. అంతకుముందు మంత్రుల బర్తరఫ్కు విపక్షాలు పట్టుబట్టాయి. స్పీకర్ పోడియాన్ని టిడిపి సభ్యులు ముట్టడించారు. దీంతో స్పీకర్ సభను పదిహేను నిమిషాలు వాయిదా వేశారు. సభ ప్రారంభమైన తర్వాత పార్టీలు స్పీకర్ను వాయిదా తీర్మానాలు ఇచ్చాయి. వాయిదా తీర్మానాలను స్పీకర్ నాదెండ్ల మనోహర్ తిరస్కరించారు.












Click it and Unblock the Notifications