కెబినెట్లో మద్యం రగడ: సిఎంను నిలదీసిన మంత్రులు
దీనిపై వట్టి స్పందించారు. సుమారు 122 మంది ప్రజా ప్రతినిధులు, 20 మంది మంత్రులు, శాసనసభలో సగం మందికి మద్యం వ్యాపారంతో సంబంధం ఉందన్న ప్రచారం జరుగుతోందని, దీని వల్ల ప్రభుత్వానికి అప్రతిష్ట అని అన్నారు. వ్యవస్థలో లోపాలున్నాయని సీనియర్ మంత్రి జానారెడ్డి అన్నారు. ఈ లోపాలను సరిదిద్దేందుకు ప్రయత్నించాల్సిన అవసరం ఉందని తెలిపారు. మంత్రి కన్నా మాట్లాడుతూ ఎసిబి దాడులు ఎవరి ప్రమేయంతోనూ జరగలేదని వివరణ ఇచ్చారు. ఈ సమయంలో మంత్రి బొత్స కల్పించుకుని... ఈ వ్యవహారంలో ఎవరి ప్రమేయం ఉన్నా, లేకున్నా ప్రజాప్రతినిధులందరూ సంజాయిషీ చెప్పుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. ఒక మహిళా ఎమ్మెల్యే లంచం అడిగారంటూ ఎసిబి అధికారులు నివేదికలను లీకు చేశారని గుర్తు చేశారు. ఇదంతా ఎందుకు జరుగుతోందని ఆయన ప్రశ్నించారు. ఆ సమయంలో ఎక్సైజ్ శాఖ మంత్రి మోపిదేవి వెంకట రమణ ఎక్సైజ్శాఖలో ఎన్ఫోర్స్మెంట్ విభాగం వేరని, అలాగే ఎసిబి వేరని, అయితే ప్రస్తుతం జరిగిన దాడులతో ఎక్సైజ్ శాఖ అధికారుల ఆత్మ స్థైర్యం దెబ్బతినడం నిజమని అన్నారు.