రిజైన్ లేనిచోట టిఆర్ఎస్‌ ఓడింది, సానుభూతే: ఎర్రబెల్లి

Errabelli Dayakar Rao
హైదరాబాద్: మహబూబ్‌నగర్ నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ గెలుపు తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు, ఎంపి కె చంద్రశేఖర రావుకు చెంప పెట్టు అని తెలుగుదేశం పార్టీ నేత ఎర్రబెల్లి దయాకర రావు బుధవారం అన్నారు. తెలంగాణవాదం తనకు మాత్రమే సొంతమన్న టిఆర్ఎస్ భ్రమలను పటాపంచలు చేస్తూ, అది అందరి సొత్తని ఈ ఎన్నికలు రుజువు చేశాయన్నారు. మహబూబ్‌నగర్‌లో బిజెపి గెలిస్తే, స్టేషన్ ఘన్‌పూర్‌లో మా అభ్యర్థికి 48వేల ఓట్లు వచ్చాయన్నారు. రాజీనామా చేసిన వారిపై ప్రజల్లో సానుభూతి వల్లే ఆ సీట్లు టిఆర్ఎస్‌కు దక్కాయన్నారు. కానీ రాజీనామాతో సంబంధంలేని మహబూబ్‌నగర్‌లో అలాంటిదేదీ లేనందువల్ల అక్కడ ఓడిందని చెప్పారు.

కాగా కాంగ్రెస్ పార్టీ అధికార దుర్వినియోగం, మిత్రపక్షమైన సిపిఎం పోటీలో ఉండటం వల్లే కోవూరులో తాను ఓటమి పాలైనట్లు టిడిపి అభ్యర్థి, ఆ పార్టీ జిల్లా శాఖ అధ్యక్షుడు సోమిరెడ్డి చంద్రమోహన్‌ రెడ్డి పేర్కొన్నారు. బుధవారం ఆయన ఎస్పీఎస్ నెల్లూరు జిల్లాలో విలేకరులతో మాట్లాడారు. ఆఖరి దశలో కాంగ్రెస్ వారు డబ్బు పంచి వైయస్సార్ కాంగ్రెసుకు ఓటేయాలని కోరడం మరో కారణమన్నారు. నియోజకవర్గంలో 19 ఏళ్లుగా ప్రసన్నకుమార్‌ రెడ్డికే పార్టీ పగ్గాలు అప్పగించడం వల్ల రెండు నెలల్లో పార్టీ శ్రేణులను సమీకరించుకోవడంలో విఫలమయ్యామన్నారు. అవినీతి, అక్రమాలకు కారకుడైన వైయస్ జగన్మోహన్ రెడ్డి పతనానికి కోవూరులో ఆ పార్టీ గెలుపే నాంది అని జోస్యం చెప్పారు. ఎన్నికల్లో, పందేలలో జగన్ పార్టీ వారే రూ.500 కోట్లు నష్టపోయారన్నారు. వచ్చే సాధారణ ఎన్నికల్లోనూ ఇక్కడి నుంచే పోటీ చేస్తానని సోమిరెడ్డి తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+