టెన్షన్ టెన్షన్: విగ్రహాల ధ్వంసం, ఇళ్ల ముట్టడి, రాళ్ల దాడి
పొన్నాల, బస్వరాజు సారయ్య, తెలుగుదేశం పార్టీ నేత ఎర్రబెల్లి దయాకర రావు ఇళ్ల పైనా ఆందోళనకారులు రాళ్లు, చెప్పులతో దాడి చేశారు. పోలీసులు వారిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. టిడిపి నేత గుండు సుధారాణికి చెందిన సుప్రభ హోటల్ పైన రాళ్ల దాడి చేశారు. పోలీసు హెడ్ క్వార్టర్స్ వద్ద ఉన్న స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహాన్ని ధ్వంసం చేశారు. హన్మకొండలోని దివంగత ప్రధాని రాజీవ్ గాంధీ విగ్రహం చెప్పులు, రాళ్లు వేశారు. పలు చోట్ల పోలీసులు లాఠీఛార్జ్ చేసి ఆందోళనకారులను చెదరగొట్టారు. అంతిమయాత్ర సందర్భంగా అడుగడుగునా పోలీసులు బందోబస్తు భారీగా ఏర్పాటు చేసిన ఆందోళనకారులు రెచ్చిపోయారు. రాజీవ్, వైయస్సార్, ఎన్టీఆర్ విగ్రహాల వద్ద భద్రత ఏర్పాటు చేశారు. ఈ దాడులలో ఇద్దరు ఫోటో గ్రాఫర్లకు, ఇద్దరు విద్యార్థులకు, పోలీసులకు గాయాలయ్యాయి.
Comments
English summary
Tension created at Warangal in Bojya Naik yatra on sunday.
Story first published: Sunday, March 25, 2012, 13:37 [IST]