తెలంగాణ కోసమే కాదు!: ఆత్మహత్యలపై సిఎం కిరణ్

తనపై తెలంగాణ ప్రాంత కాంగ్రెసు పార్లమెంటు సభ్యులు అధిష్టానానికి ఫిర్యాదు చేయడం వారి వ్యక్తిగతమన్నారు. కాంగ్రెసు పార్టీలో అసమ్మతి మామూలే అన్నారు. అసంతృప్తి కాంగ్రెసులో ఓ భాగం అన్నారు. కాంగ్రెసు పార్టీలో స్వేచ్ఛ ఎక్కువని, అసమ్మతి ఎప్పుడూ ఉంటూనే ఉంటుందన్నారు. అతిగా వ్యవహరించిన వారిపై గతంలో చర్యలు తీసుకున్నామన్నారు. గీత దాటిన వారిపై సమయం వచ్చినప్పుడు చర్యలు తీసుకుంటామన్నారు. విద్యుత్ ఛార్జీల పెంపుపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని చెప్పారు. రెగ్యులేటరీ కమిషన్ ఆదేశాలు ఇంకా రాలేదన్నారు. ఏఏ విభాగాల్లో ఛార్జీలు తగ్గించాలనే విషయంపై ప్రభుత్వం ఆలోచిస్తుందన్నారు. దేవదాదాయ శాఖ మంత్రి రామచంద్రయ్య వ్యాఖ్యలపై ఆయన సమాధానాన్ని దాట వేశారు. ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ కమిటీ ఏర్పాటుకు సిద్ధంగా ఉన్నామన్నారు.












Click it and Unblock the Notifications