హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అధ్యక్షుల్ని పిలిస్తే చాలు: చిదంబరానికి కెటిఆర్ సూచన

By Srinivas
|
Google Oneindia TeluguNews

KT Rama Rao
హైదరాబాద్: అఖిలపక్ష భేటీపై కేంద్రమంత్రి చిదంబరానికి తెలంగాణ రాష్ట్ర సమితి సిరిసిల్ల శాసనసభ్యుడు కల్వకుంట్ల తారక రామారావు సూచన చేశారు. మంగళవారం ఆయన మీడియా పాయింట్ వద్ద మాట్లాడారు. చిదంబరంపై తీవ్రస్థాయిలో విరుచుకు పడ్డారు. కేంద్రానికి చిత్తశుద్ధి ఉంటే అఖిల పక్షానికి రెండు ప్రాంతాల వారిని పిలవడమెందుకని ప్రశ్నించారు. పార్టీ అధ్యక్షులను పిలిస్తే చాలని సూచించారు. కేంద్రానికి అసలు తెలంగాణ ఇచ్చే ఉద్దేశ్యం ఉందో లేదో చెప్పాలన్నారు. అఖిలపక్షం అనే చిదంబరం మాటలు అరిగిపోయిన రికార్డ్ అన్నారు. తెలంగాణ విషయంలో తాము కేంద్రం ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని సూచించామన్నారు. తెలంగాణపై చర్చకు ప్రభుత్వానికి ఇష్టం లేదన్నారు. అందుకే ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సభను వాయిదా వేసేలా చేస్తున్నారని ఆరోపించారు.

తెలంగాణ విషయంలో సంయమనం పాటించాల్సింది ప్రజలు కాదన్నారు. ప్రజల నిర్ణయాలు శిరసావహిస్తామని పార్టీలు చెప్పాలని డిమాండ్ చేశారు. చిదంబరం తెలంగాణపై తమ పార్టీ మేనిఫెస్టోను చూసుకోవాలన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఎలా బుద్ధి చెప్పాలో తమకు తెలుసునన్నారు. ఈ సభలో మృతి చెందిన వారికి సంతాపం తెలిపే సంస్కారం లేదా అని ఈటెల రాజేందర్, జూపల్లి కృష్ణా రావు అన్నారు. ఇది మర్యాద కాదని స్పీకర్‌ను కలిసి చెప్పామన్నారు. రేపైనా చర్చకు అనుమతించాలన్నారు. తెలంగాణ ఇస్తామని మోసం చేసిన రాజీకీయ పార్టీల వల్లే ఆత్మహత్యలు అన్నారు. టిడిపికి తెలంగాణ ద్రోహం చేసిందన్నారు.

కాగా తెలంగాణపై తీర్మానం కోసం తెరాస సభ్యులు స్పీకర్ చాంబర్ వద్ద ఆందోళన చేశారు. స్పీకర్ వారిని పిలిచి మాట్లాడారు. తెలంగాణపై చర్చకు అనుమతివ్వాలని డిమాండ్ చేశారు. దీంతో ఆయన రేపు ఉదయం 9.30 గంటలకు అన్ని రాజకీయ పార్టీలతో సమావేశమై నిర్ణయం తీసుకుంటానని చెప్పారు. కాగా టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు రాజ్యసభకు ఎంపికైన చిరంజీవిని అభినందించి తెలంగాణకు సహకరించాల్సిందిగా కోరారు.

English summary
TRS MLA KT Rama Rao suggested minister Chidambaram on Telangana issue.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X