అధ్యక్షుల్ని పిలిస్తే చాలు: చిదంబరానికి కెటిఆర్ సూచన
తెలంగాణ విషయంలో సంయమనం పాటించాల్సింది ప్రజలు కాదన్నారు. ప్రజల నిర్ణయాలు శిరసావహిస్తామని పార్టీలు చెప్పాలని డిమాండ్ చేశారు. చిదంబరం తెలంగాణపై తమ పార్టీ మేనిఫెస్టోను చూసుకోవాలన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఎలా బుద్ధి చెప్పాలో తమకు తెలుసునన్నారు. ఈ సభలో మృతి చెందిన వారికి సంతాపం తెలిపే సంస్కారం లేదా అని ఈటెల రాజేందర్, జూపల్లి కృష్ణా రావు అన్నారు. ఇది మర్యాద కాదని స్పీకర్ను కలిసి చెప్పామన్నారు. రేపైనా చర్చకు అనుమతించాలన్నారు. తెలంగాణ ఇస్తామని మోసం చేసిన రాజీకీయ పార్టీల వల్లే ఆత్మహత్యలు అన్నారు. టిడిపికి తెలంగాణ ద్రోహం చేసిందన్నారు.
కాగా తెలంగాణపై తీర్మానం కోసం తెరాస సభ్యులు స్పీకర్ చాంబర్ వద్ద ఆందోళన చేశారు. స్పీకర్ వారిని పిలిచి మాట్లాడారు. తెలంగాణపై చర్చకు అనుమతివ్వాలని డిమాండ్ చేశారు. దీంతో ఆయన రేపు ఉదయం 9.30 గంటలకు అన్ని రాజకీయ పార్టీలతో సమావేశమై నిర్ణయం తీసుకుంటానని చెప్పారు. కాగా టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు రాజ్యసభకు ఎంపికైన చిరంజీవిని అభినందించి తెలంగాణకు సహకరించాల్సిందిగా కోరారు.