తెలంగాణపై పట్టు: గొంతు కలిపిన టి-కాంగ్రెస్, వాయిదా

రెండోసారి సభ ప్రారంభమయ్యాక కూడా తెలంగాణ ప్రాంతానికి చెందిన విపక్ష ఎమ్మెల్యేలు తీర్మానం కోసం పట్టుబట్టారు. బిజెపి, టిఆర్ఎస్, సిపిఐ, తెలంగాణ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలతో తెలంగాణ ప్రాంత కాంగ్రెసు ఎమ్మెల్యేలు కూడా ఈసారి గొంతు కలిపారు. తెలంగాణకు అనుకూలంగా నినాదాలు చేశారు. బిజెపి, టిఆర్ఎస్ సభ్యులు పోడియం మరోసారి చుట్టుముట్టారు. ఆందోళన మధ్యే ప్రభుత్వం పద్దులను ప్రవేశ పెట్టింది. ఆ తర్వాత స్పీకర్ సభను అరగంట పాటు రెండోసారి వాయిదా వేశారు.
కాగా తెలుగుదేశం పార్టీ నేత మోత్కుపల్లి నర్సింహులు మీడియా పాయింట్ వద్ద మాట్లాడారు. తెలంగాణలో ఆత్మహత్యలకు కారణం తెరాసనేనని ఆయన ఆరోపించారు. కెసిఆర్ కాంగ్రెసుతో లాలూచీపడటం వల్లనే ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు మరింత ఆలస్యమౌతోందన్నారు. కాంగ్రెసుకు అమ్ముడుపోయిన కెసిఆర్ అధికారంలో ఉన్న వారి మెడలు వంచక ప్రతిపక్షాలపై విమర్శలు చేయడం ఎంత వరకు సమంజసమని ఆయన ప్రశ్నించారు. యువతను రెచ్చగొట్టే విధంగా మాట్లాడటం వల్లే ఆత్మహత్యలు పెరిగిపోతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications