ఏమీ చేయలేం: తెలంగాణపై చేతులెత్తేసిన చిదంబరం

రాష్ట్రంలోని రాజకీయ పార్టీలకు తెలంగాణ అంశంపై స్పష్టత లేకుండా తాము ఏమీ చేయలేమని ఆయన అన్నారు. రాష్ట్రంలోని రాజకీయ పార్టీలు స్పష్టతకు వస్తే అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేస్తామని ఆయన చెప్పారు. రాజకీయ పార్టీలు స్పష్టతకు వచ్చి ఉంటే అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేసి ఉండేవాళ్లమని ఆయన అన్నారు. రాయలసీమ రాష్ట్ర ఏర్పాటు డిమాండ్ కూడా ఉందని, తలా ఒక్కటి కోరుకుంటే సమస్య ఎలా పరిష్కారమవుతుందని చిదంబరం అన్నారు.
తెలంగాణపై కాంగ్రెసు, తెలుగుదేశం, మజ్లీస్, వైయస్సార్ కాంగ్రెసు పార్టీలు తమ వైఖరులను స్పష్టం చేయాల్సి ఉందని, ఆ పార్టీలు స్పష్టమైన వైఖరిని తీసుకుని వస్తేనే తెలంగాణ సమస్య పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వం ఏమైనా చేస్తుందని ఆయన చాలా కాలంగా చెప్పుకుంటూ వస్తున్నారు.












Click it and Unblock the Notifications