వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ప్రత్యేక రాష్ట్రం కోరే వాళ్లం కాదు: వైయస్ వివేకానందరెడ్డి
రాయలసీమలో తలపెట్టిన అన్ని ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేస్తే ఆ ప్రాంతం శాశ్వతంగా ప్రయోజనాలు పొందుతుందన్నారు. కేంద్ర ప్రభుత్వం దృష్టికి తమ ప్రాంత సమస్యలను తీసుకు వెళ్లేందుకే మద్దతు తెలుపుతున్నట్టు చెప్పారు. సీమ వెనుకబాటు గురించి, మా అభివృద్ధి గురించి శ్రీ కృష్ణ కమిటీ నివేదికలో ఉందని అన్నారు. మేం అభివృద్ధిని కోరుకుంటున్నామన్నారు. ప్రత్యేక రాష్ట్రం అడిగే వాళ్లం కాదన్నారు. తమకు సమైక్య రాష్ట్రంలో అభివృద్ధి కావాలన్నారు. మాది న్యాయ పోరాటమని, మెతుకు, బతుకు కోసం పోరాటమన్నారు. రాజ్యసభ రానందుకు తనకు అసంతృప్తి లేదన్నారు. కాగా రాయలసీమ విద్యార్థులు ప్రత్యేక ప్యాకేజీ కోసం డిమాండ్ చేస్తున్నారు.
Comments
ys vivekananda reddy rayalaseema telangana congress new delhi వైయస్ వివేకానంద రెడ్డి రాయలసీమ తెలంగాణ కాంగ్రెస్ న్యూఢిల్లీ
English summary
YS Vivekananda Reddy said that they will not demand for separate Rayalaseema state.
Story first published: Wednesday, March 28, 2012, 14:57 [IST]