బాబుకు షాక్: టిడిపి నుంచి జంప్నకు మైసురా రెడీ?

గతంలో కూడా చాలా మంది రాజ్యసభ పదవీ కాలం ముగియగానే తెలుగుదేశం పార్టీకి గుడ్ బై చెప్పి వేరే పార్టీల్లో చేరిపోయారు. అలాంటి ఓ సంప్రదాయం తెలుగుదేశం పార్టీకి ఉంది. అలాంటి పరిస్థితే ఇప్పుడు వస్తుందని అంటున్నారు. అలాంటి నాయకులు డజనుకు పైగానే ఉన్నారు. ప్రస్తుతం మంత్రిగా ఉన్న సి. రామచంద్రయ్య కూడా అదే పని చేశారు. జయప్రద, రేణుకా చౌదరి కూడా ఈ కోవలోకే వస్తారు. రామ మునిరెడ్డి, రుమాండ్ల రామచంద్రయ్య వంటివారు ఇతర పార్టీల్లోకి వెళ్లిపోయారు.












Click it and Unblock the Notifications