హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తెలంగాణ పరిష్కారానికి కృషి, సూసైడ్‌‍లు వద్దు: బాబు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Chandrababu Naidu
హైదరాబాద్: తెలంగాణ సమస్య పరిష్కారానికి తెలుగుదేశం పార్టీ కృషి చేస్తుందని ఆ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శుక్రవారం చెప్పారు. చంద్రబాబు తన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. తెలంగాణ సమస్యను పరిష్కరించేందుకు మా వంతు ప్రయత్నాలు చేస్తామన్నారు. విద్యార్థులు, యువత ఎవరూ కూడా ఆత్మహత్యలకు పాల్పడవద్దని ఆయన సూచించారు. ఆత్మహత్యలు చాలా ఆందోళన కలిగిస్తోందన్నారు. తల్లిదండ్రులను ఇబ్బందులకు గురి చేయవద్దని సూచించారు. ప్రాణాలు చాలా విలువైనవన్నారు. ఆత్మహత్యలతో కుటుంబానికి ఆందోళన కలిగించ వద్దన్నారు. తెలంగాణ ప్రాంతంలో గతంలో కంటే పార్టీ బాగా మెరుగు పడిందన్నారు. అందరితో మాట్లాడి సమస్యను పరిష్కరించే దిశలో ఆలోచిస్తామన్నారు. పార్టీని కాపాడుకుంటూ సమస్యను పరిష్కరిస్తామన్నారు.

కాగా అంతకుముందు తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేతలతో బాబు భేటీ అయ్యారు. తెలంగాణపై ఏం చేద్దామని వారితో ఆయన చర్రించారు. తెలంగాణపై ఇప్పటికే పార్టీ తరఫున స్పష్టత ఇచ్చామని అయినప్పటికీ ప్రజల్లో కొన్ని అపోహలు ఉన్నాయని వాటిని తొలగించేందుకు ఏం చేద్దామని నేతలను ఆయన ప్రశ్నించినట్లుగా తెలుస్తోంది. వాటిని తొలగించేందుకు ఏం చేయాలో ఆలోచిద్దామని అన్నారు. సీమాంధ్రలో పార్టీకి ఇబ్బంది లేకుండా ఇక్కడ ప్రజలకు కూడా సానుకూల సంకేతం ఇవ్వడం ఎలాగో ఆలోచించాలని నేతలకు ఆయన సూచించినట్లుగా సమాచారం.

English summary

 TDP chief Nara Chandrababu Naidu said that party is trying to solve Telangana issue.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X