హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జగన్ కేసు: మంత్రులకు అందిన సుప్రీం నోటీసులు

By Pratap
|
Google Oneindia TeluguNews

Kanna Laxminarayana - Dhrmana Prasad Rao
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు అధ్యక్షుడు వైయస్ జగన్ ఆస్తుల కేసులో ఆరుగురు రాష్ట్ర మంత్రులకు సుప్రీంకోర్టు నోటీసులు అందాయి. వైయస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వ హయాంలో జారీ అయిన 26 జీవోలపై సుప్రీంకోర్టు ఈ నోటీసులు జారీ చేసింది. మంత్రులు ధర్మాన ప్రసాదరావు, మోపిదేవి వెంకటరమణ, సబితా ఇంద్రా రెడ్డి, జె. గీతా రెడ్డి, పొన్నాల లక్ష్మయ్య, కన్నా లక్ష్మినారాయణలు ఈ నోటీసులు అందుకున్నారు. తమకు నోటీసులు అందినట్లు మంత్రి కన్నా లక్ష్మినారాయణ ధ్రువీకరించారు. ఎనిమిది మంది ఐఎఎస్ అధికారులకు కూడా సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. అయితే, తమకు నోటీసులు అందలేదని కొంత మంది ఐఎఎస్ అధికారులు చెబుతున్నారు.

నోటీసులు అందిన వెంటనే మంత్రులు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో సమావేశమయ్యారు. నోటీసులపై తమ కార్యాచరణకు సంబంధించి వారు ముఖ్యమంత్రితో చర్చించారు. నోటీసులో తాము ఇంకా చూడలేదని, చూసిన తర్వాత ఏం చేయాలో నిర్ణయించుకుంటామని మంత్రి కన్నా లక్ష్మినారాయణ చెప్పారు. తాము ఆరుగురు మంత్రులం కలిసే ఏం చేయాలనే విషయంపై నిర్ణయం తీసుకుంటామని ఆయన చెప్పారు. ముఖ్యమంత్రితో కలిసి చర్చించిన తర్వాత నిర్ణయం తీసుకుంటామని మంత్రులు అంటున్నారు.

వైయస్ జగన్ ఆస్తుల కేసుకు సంబంధించి ఓ న్యాయవాది వేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు ఆరుగురు మంత్రులకు, ఎనిమిది మంత్రులకు నోటీసులు జారీ చేసింది. సుప్రీంకోర్టు నోటీసులు అందుకున్న మంత్రులను బర్తరఫ్ చేయాలని ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం డిమాండ్ చేస్తోంది.

English summary
Six ministers have recieved notices from Supreme Court in YSR Congress president YS Jagan,
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X