హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తెలంగాణ కోసం మరో ఆత్మహత్య, శ్రీకాంత్ మృతి

By Pratap
|
Google Oneindia TeluguNews

Telangana Map
హైదరాబాద్: తెలంగాణ కోసం మరో వ్యక్తి అత్మబలిదానానికి ఒడిగట్టాడు. మెదక్ జిల్లా దుద్దెడ గ్రామానికి చెందిన అవునూరు సత్తయ్య (37) అనే వ్యక్తి ఉరేసుకుని శుక్రవారం రాత్రి ఆత్మహత్య చేసుకున్నాడు. తన చావుకు సీమాంధ్ర నేతలే కారణమని, తమ తెలంగాణ తమకు కావాలని, జై తెలంగాణ జైజై తెలంగాణ అంటూ సూసైడ్ నోట్ రాసి అతను ఆత్మహత్య చేసుకున్నాడు. మెడలో తెరాస కండువా వేసుకుని ఇంట్లోని దూలానికి ఉరేసుకుని మరణించాడు.

హైదరాబాదు శివారులోని ఎన్టీఆర్ నగర్‌లో బుధవారం ఆత్మహత్యా యత్నం చేసుకున్న శ్రీకాంత్ మృత్యువుతో పోరాడి ఓడిపోయాడు. తెలంగాణ కోసం ఆత్మహత్యా యత్నానికి దిగిన శ్రీకాంత్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. శుక్రవారం రాత్రి అతను మరణించాడు. ఇదిలావుంటే, తెలంగాణ సాధన కోసం మరో యువకుడు ఆత్మహత్యా యత్నానికి దిగాడు. నల్లగొండ జిల్లా దామరచర్ల మండలం కొండప్రోల్‌లో ఈ సంఘటన జరిగింది. శుక్రవారం మధ్యాహ్నం బండావత్ సురేష్ (30) అనే యువకుడు ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. మంటలను అదుపు చేయడానికి భార్య కళావతి ప్రయత్నించింది. అతను మిర్యాలగుడా ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.

English summary
Another person commited suicide for Telangana, it was in Medak district this time.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X