హైదరాబాద్ కొత్త ఇష్యూ కాదు: తెలంగాణపై దానం
సామాన్యులపై, పేదలపై విద్యుత్ చార్జీల భారం వేయడం బాధాకరమని ఆయన అన్నారు. ఈ విషయంపై తాను ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో మాట్లాడుతానని ఆయన చెప్పారు. ముఖ్యమంత్రి బాగా పనిచేస్తున్నారని తాను అధిష్టానానికి చెప్పినట్లు ఆయన తెలిపారు. దానం నాగేందర్ ఇటీవల పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీని, ఆజాద్ను కలిసిన విషయం తెలిసిందే. తెలంగాణ ఏర్పాటు విషయంలో దానం నాగేందర్ హైదరాబాద్ అంశాన్ని లేవనెత్తినప్పుడు కొత్త సమస్యలు సృష్టించవద్దని సోనియా సూచించినట్లు వార్తలు కూడా వచ్చాయి.
Comments
English summary
Minister Danam Nagender said that Congress high command is serious on Telangana issue.
Story first published: Saturday, March 31, 2012, 15:16 [IST]