జగన్కు సిఎం పదవి 68వ కంపెని: ధర్మాన సెటైర్
జగన్ ఓ కోళ్లఫారం యజమానితో సమానమన్నారు. ముఖ్యమంత్రి పదవి కోసమే ఆయన ఆరాటం అంతా అన్నారు. జగన్కు లక్షల కోట్ల ఆస్తి ఎలా వచ్చిందో ఓసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలని మరో మంత్రి కొండ్రు మురళీ మోహన్ అన్నారు. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అభివృద్ధిని అడ్డుకుంటున్నారని అన్నారు. ఆయన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పైన విమర్శలు చేయడం సరికాదన్నారు. కాగా ఏది ఏమైనా పోలవరం ప్రాజెక్టు నిర్మించి తీరుతామని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి వట్టి వసంత్ కుమార్ వేరుగా పశ్చిమ గోదావరి జిల్లాలో అన్నారు. ఏప్రిల్, మే నెలల్లో టెండర్లు పిలిచి పనులు ప్రారంభించి రెండు మూడేళ్లలో ప్రాజెర్టు నిర్మిస్తామన్నారు. పోలవరం ప్రాజెక్టును ముందుకు తీసుకు వెళ్లలేని పక్షంలో మేం మంత్రులుగా కొనసాగడానికి సిద్ధంగా లేమన్నారు.
dharmana prasad rao kondru murali vatti vasanth kumar ys jagan srikakulam ధర్మాన ప్రసాద రావు కొండ్రు మురళి వట్టి వసంత్ కుమార్ వైయస్ జగన్ శ్రీకాకుళం
English summary
Minister Dharmana Prasad Rao said that CM post is 68th company to YSR Congress Party chief YS Jaganmohan Reddy.
Story first published: Sunday, April 1, 2012, 16:07 [IST]