గుంటూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఉపఎన్నికల్లో మా పార్టీ తరఫున పోటీ చేస్తాం: కెఏ పాల్

By Srinivas
|
Google Oneindia TeluguNews

ka paul
గుంటూరు: రానున్న ఉప ఎన్నికల్లో తమ పార్టీ తరఫున అభ్యర్థులను నిలబెట్టే యోచనలో ఉన్నట్లు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు, ప్రముఖ క్రైస్తవ మత ప్రచారకుడు కెఎ పాల్ ఆదివారం అన్నారు. అభ్యర్థులను నిలబెట్టే విషయమై త్వరలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ఒకవేళ పోటీ చేయని పక్షంలో ఏ పార్టీకి మద్దతిస్తామో అప్పుడే తెలియజేస్తామని ఆయన అన్నారు. పద్దెనిమిది అసెంబ్లీ, ఒక పార్లమంటుకు జరగనున్న అన్ని నియోజకవర్గాలలో తాను త్వరలో పర్యటిస్తానని కెఏ పాల్ చెప్పారు. ఎన్నికలయ్యాక పార్టీని బలోపేతం చేస్తానని చెప్పారు.

కాగా కెఏ పాల్ ప్రజాశాంతి పార్టీ స్థాపించిన అనంతరం పార్టీ పరంగా కార్యక్రమాలు చేసింది తక్కువే అని చెప్పవచ్చు. అయితే త్వరలో జరగనున్న ఎన్నికల్లో పాల్గొంటానని చెప్పడం ద్వారా తన పార్టీని బలోపేతం చేయాలనే ఉద్దేశ్యం ఆయనలో కనిపిస్తోంది.

English summary
KA paul said that his Prajasanthi party may contest in 
 
 coming bypolls.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X