పంతం నెగ్గించుకున్న బాబు: ఎన్టీఆర్కు నివాళులు

ఎన్టీఆర్ విగ్రహం వద్దకు చేరుకున్న చంద్రబాబు విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణకు వ్యతిరేకంగా ధర్నా చేపడితే పోలీసులు అడ్డుకున్నారని ఆయన అన్నారు. అనేక ఇబ్బందులు కలిగించారని ఆయన అన్నారు. తమ పార్టీ నాయకుడు అశోక్ గజపతి రాజుకు కూడా ఆగ్రహం వచ్చిందని, అశోక్ గజపతి రాజు తలుచుకుంటే బొత్స సత్యనారాయణ విజయనగరంలో ఉంటారా అని ఆయన అన్నారు.
మద్యం సిండికేట్లకు వ్యతిరేకంగా తాము తలపెట్టిన ధర్నాకు అనుమతి ఇచ్చే వరకు విజయనగరం జిల్లా కలెక్టర్ కార్యాలయం నుంచి కదిలేది లేదని నారా చంద్రబాబు నాయుడు అంతకు ముందు పట్టబట్టారు. నాలుగు రోజులైనా ఇక్కడే ఉంటానని ఆయన చెప్పారు. రాత్రి కూడా ఇక్కడే ఉంటానని ఆయన చెప్పారు. రోడ్డుపైన బైఠాయించారు.
ప్రజాస్వామ్య బద్ధంగా ధర్నా చేస్తే మీకున్న అభ్యంతరమేమిటని ఆయన పోలీసు అధికారులను ప్రశ్నించారు. ధర్నాకు ఎందుకు అనుమతి ఇవ్వలేదని ఆయన ఎస్పీ కార్తికేయపై మండిపడ్డారు. తాను కదిలేది లేదంటూ చంద్రబాబు రోడ్డుపై బైఠాయించారు. కలెక్టర్ కార్యాలయం జంక్షన్లో ఉన్న ఎన్టీ రామారావు విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించడానికి కూడా చంద్రబాబుకు పోలీసులు అనుమతి ఇవ్వలేదు. దీంతో చంద్రబాబు మరింతగా ఆగ్రహించారు.
-
ప్రభుత్వ ఉపాధ్యాయులకు డబుల్ శుభవార్తలు చెప్పిన ఏపీ సర్కార్! -
ఉగాది నుంచి కన్యారాశి, సింహరాశి వారి జాతక ఫలం -
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
India Post GDS 2nd Merit List 2026: పోస్టల్ జాబ్స్ రెండో మెరిట్ లిస్ట్ అప్పుడే? -
మెగాస్టార్కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!! -
T20 World Cup: సూర్యకుమార్ యాదవ్ కు ఐసీసీ అనూహ్య షాక్..! -
పెళ్లైన హీరోతో ఎఫైర్ వల్ల సినిమాల్లో బ్యాన్.. ఎవరా డ్రీమ్ గర్ల్ ?? -
ముఖానికే కాదు అక్కడ కూడా మేకప్ వేసుకోవాలన్నారు..! -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!!












Click it and Unblock the Notifications