ఎట్టకేలకు మావోల చెర నుండి కలెక్టర్ పాల్ విడుదల

కాగా గత నెల ఏప్రిల్ 21వ తేదిన కలెక్టర్ అలెక్స్ మీనన్ ను మావోయిస్టులు కిడ్నాప్ చేసిన విషయం తెలిసిందే. అతనిని విడుదల చేయించడానికి బిడి శర్మ, హరగోపాల్ మధ్యవర్తులుగా వ్యవహరించారు. వారి కృషి ఫలించింది. వీరు నాలుగు దఫాలుగా అటు ప్రభుత్వం, ఇటు మావోయిస్టులతో చర్చలు జరిపారు.
మావోయిస్టుల చెరలో మీనన్ పదమూడు రోజులు ఉన్నారు. మధ్యవర్తులు ఇద్దరూ హెలికాప్టర్ ద్వారా సుకుమా జిల్లాలోని చింతల్నార్ గ్రామానికి చేరుకొని అక్కడి నుండి రోడ్డు మార్గాన తాడిమెట్లకు చేరుకున్నారు. అస్తమాతో బాధపడుతున్న అలెక్స్ పాల్కు చికిత్స అందించేందుకు సిద్ధంగా ఉండాలని సుకుమా, దంతేవాడ, జగ్గల్ పూర్, రాయపూర్ జిల్లాలోని వైద్య అధికారులకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. చింతల్నార్ వద్ద అంబులెన్స్ ను సిద్ధంగా ఉంచారు.
కాగా అలెక్స్ విడుదలపై ఆయన సతీమణి, కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. కాగా కలెక్టర్ విడుదలకు మావోయిస్టులు పెట్టిన పలు ఒప్పందాలకు చత్తీస్గఢ్ ప్రభుత్వం అంగీకరించింది. ఈ మేరకు ఆయనను విడుదల చేశారు. కాగా రాయపూర్కు ఐదువందల కిలోమీటర్ల దూరంలోని అడవులలో మధ్యాహ్నం 3.45 గంటల ప్రాంతంలో కలెక్టర్ను విడుదల చేశారు.
-
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే! -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి?











Click it and Unblock the Notifications